ఇటీవల కాలంలో మీడియా అతి ఎక్కువగా సార్లు రాసిన పెళ్లి వార్త ప్రభాస్‌ అనుష్కలదే. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ ఫుల్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌ అనుష్కల మీద చాలా సార్లు గాసిప్స్‌ వచ్చాయి. ప్రభాస్‌, అనుష్క తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే వీరిద్దరు వివాహబంధంతో ఒక్కటవ్వబోతున్నారని ప్రచారం జరిగింది. వారిద్దరు కూడా సినిమా ఫంక్షన్లలో చాలా క్లోజ్‌గా మూవ్‌ అవ్వటంతో ఈ వార్తలు నిజమే అనుకున్నారు ఫ్యాన్స్‌.

 

బిల్లా సినిమాలో తొలిసారిగా కలిసి నటించారు ప్రభాస్‌, అనుష్క. ఈ సినిమాలో వీళ్ల కెమిస్ట్రీ సూపర్బ్‌ అనిపించటంతో తరువాత మిర్చి సినిమాలో రిపీట్ చేశారు. మిర్చి సినిమాలో ప్రభాస్, అనుష్కల ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చూసిన ఆడియన్స్‌ వీళ్లు రియల్‌ లైఫ్‌లోనూ పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంటారని భావించారు. అదే ఒపీనియన్‌ మీడియాలో వినిపించటంతో త్వరలోనే ప్రభాస్‌, అనుష్కల పెళ్లి అన్న వార్త మొదలైంది.

 

తరువాత బాహుబలి లాంటి భారీ చిత్రంలోనూ ప్రభాస్‌ అనుష్కలు కలిసి నటించటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. దీంతో ప్రభాస్, అనుష్క పెళ్లి అన్న వార్త మీడియాలో చాలా కాలం పాటు వైరల్ అయ్యింది. ఈ వార్తలపై డార్లింగ్‌ కూడా చాలా కాలం పాటు సైలెంట్‌గానే ఉన్నాడు. కానీ ఒక దశలో పుకార్లు కాస్త శృతిమించుతుండటంతో వాటి మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మేం జస్ట్ ఫ్రెండ్స్‌ మాత్రమే మా మధ్య అంతుకు మించి ఏం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. అనుష్క కూడా పలు సందర్భాల్లో ఇదే మాట చెప్పింది.

 

అయితే వాళ్లు క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా పుకార్లు మాత్రం ఆగటం లేదు. బాహుబలి సినిమా తరువాత కూడా పలు వేదిక మీద, ప్రైవేట్ ఫంక్షన్లలో అనుష్క, ప్రభాస్‌లు కలిసి కనిపించారు. దీంతో అలా వాళ్లు కనిపించిన ప్రతీసారి ఇవే రూమర్స్‌ తెర మీదకు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: