50 సినిమాలకు పైగా నటించిన ఛార్మీ ఇండస్ట్రీలోని చాలా మంది హీరోలతో నటించింది. ‘జ్యోతిలక్ష్మి’ మూవీతో హీరోయిన్ గా తిరిగి తన సత్తా చాటాలని ఆమె ప్రయత్నించినా ఆ సినిమా ఫెయిల్ కావడంతో ఆమెకు నష్టాలు మాత్రమే మిగిలాయి. 


దీనితో ఏమాత్రం నిరాశ పడకుండా ఆమె టాలీవుడ్ ఏక్తా కపూర్ గా మారలని ప్రయత్నిస్తూ సినిమా నిర్మాతగా కొనసాగుతూ ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి భారీ హిట్ ను అందుకుని ఊహించని లాభాలు పొందింది. ప్రస్తుతం ఈమె ఒకవైపు పూరి తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న 'రొమాంటిక్' మరోవైపు విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ సినిమాల నిర్మాణంలో చాల బిజీగా  ఉంటోంది. 


వాస్తవానికి నిర్మాతగా ఈమె మారిపోయినప్పటికి హీరోయిన్ గా ఈమె ను  అభిమానించే వారు ఇప్పటికీ చాలమంది ఉన్నారు. ప్రస్తుతం నిర్మాతగా  మారిన ఛార్మీ తన గ్లామర్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని ఆమె అభిమానులు సూచనలు చేస్తున్నారు. మరికొందరు అభిమానులు అయితే  ఛార్మి పళ్ల పై బెంగ పెట్టుకుంటూ ఆమె పను వరసకు ఏమైంది అంటూ గగ్గోలు పెడుతున్నారు. అంతేకాదు టీవీ ప్రకటనల్లో చూపించినట్టుగా క్లోజప్ పెప్సోడెంట్ డాబర్ హిమాలయా లాంటివి వాడడం  లేదా అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. 


దీనికి కారణం ఛార్మీ టీత్ లో మునుపటి గ్లో లేదని కామెంట్లు వస్తున్నాయి.   అంతేకాదు ఆమె పను వరస కలర్ మారింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ప్రస్తుతం ఛార్మీ పళ్ళను చూస్తూ ఉంటే   ఒరిజినల్ పళ్లలా కాకుండా అర్టిఫిషియల్ గా కనిపిస్తున్నాయని కొందరు జోక్ చేస్తున్నారు. సాధారణంగా సెలెబ్రెటీల పను వరసల గురించి కామెంట్స్ రావు. అయితే ఛార్మీ విషయంలో ఈ చిన్న విషయం పై కూడ తేడాను చాల స్పష్టంగా ఫాలో అవుతూ ఆమెను రకరకాల కామెంట్స్ తో వెంటాడుతున్నారు. ప్రస్తుతం ఛార్మీ బిజినెస్ ఉమెన్ గా మారిన పరిస్థితులలో ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ను ఆమె లెక్క చేసే పరిస్థితి లేదు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: