గతంలో ఏమో గాని ఇప్పుడు మాత్రం టాలీవుడ్ హీరోలు ప్రేమ వ్యవహారాలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎంత స్టార్ ఇమేజ్ ఉన్న హీరో అయినా సరే పైకి కనపడకుండా చక్కబెట్టేస్తూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. స్టార్ హీరోలు సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. ఒక్క ప్రభాస్ మినహా అందరికి దాదాపుగా పెళ్లిల్లు అయిపోయాయి కూడా. అయితే కెరీర్ తొలి రోజుల్లో మాత్రం హీరోలు ప్రేమ కథలను ఎక్కువగానే నడిపించారు. దీనికి సంబంధించి అప్పట్లో పెద్ద ఎత్తున రూమర్లు కూడా వస్తూ ఉండేవి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఒక రూమర్ వచ్చింది. 

 

జూనియర్ కి సమీరా రెడ్డి తో ప్రేమాయణం ఉందీ అంటూ వార్తలు వచ్చాయి. వాళ్ళు ఇద్దరూ కలిసి సినిమాలు కూడా చేసారు. రెండు సినిమాల్లో కలిసి నటించారు ఆ ఇద్దరూ. అశోక్, నరసింహుడు సినిమాలు కథ లేకపోయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఆ రెండు సినిమాలు చేసాడు. ఆ రెండు సినిమాల్లో హీరోయిన్ సమీరా రెడ్డే. అప్పట్లో ఆమెను వివాహం చేసుకోవాలని భావించి తండ్రి హరికృష్ణ దృష్టికి కూడా తారక్ తీసుకువెళ్ళాడు. కాని దీనికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం తో ఆ వివాహం అప్పట్లో ఆగిపోయింది అన్నారు. 

 

తన సినిమాలో ఆమెను అసభ్యంగా బట్టలు వేసుకోకుండా ఎక్కువగా పంజాబీ డ్రెస్ లే వేసుకోమని చెప్పాడట. అందుకే ఆమె సినిమా మొత్తం అలాగే కనపడింది. ఆ తర్వాత సమీరా రెడ్డి చిరంజీవి తో కూడా సినిమాలు చేసింది. మరి ఏమైందో ఏమో తెలియదు గాని ఆమె జూనియర్ ఎన్టీఆర్ ని వివాహం చేసుకోలేదు. ఆ తర్వాత టాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు చేసినా సరే ఎక్కువగా కనపడలేదు. బాలీవుడ్ కి వెళ్ళిపోయి, ధోని, యువరాజ్ తో ఆమె ప్రేమ కథలు నడిపింది అనే వ్యాఖ్యలు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: