తెలుగు ఇండస్ట్రీలో గత ఏడాది స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చేసుకొని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ రిలీజ్ అయ్యింది.  పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ‘సైరా’ కన్నడ, మళియాళ, హింది, తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది.  తెలుగు లో తప్ప మిగతా భాషల్లో భారీ డిజాస్టర్ అయ్యింది.  తెలుగు లో కూడా కాస్త పరవాలేదు అన్న టాక్ మాత్రమే వినిపించింది.  ఈ చిత్రం కొణిదెల రామ్ చరణ్ తెరకెక్కించారు.  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఓ కీలక పాత్రలో రామ్ చరణ్, మహేష్ బాబు లు కనిపించబోతున్నారట. ఈ విషయం చిత్ర యూనిట్ ఇప్పటి వరకు అఫిషియల్ గా చెప్పలేదు.

 

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శిల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుందట.  ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం కొరటాల కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  ఈ చిత్రం 5 నెలలలోనే పూర్తి చేస్తానని మాట ఇచ్చినట్టుగానే కొరటాల పక్కా ప్లానింగ్ తో వెళుతున్నాడు. 

 

మే చివరి నాటికి షూటింగును పూర్తి చేసి, ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను కానిచ్చేసి ఆగస్టులో చిరంజీవి పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో  ఉన్నారట కొరటాల.  అంటే ఈలోగా ఫస్ట్ లుక్, టీజర్ ప్లానింగ్ చేయాల్సిందే. ఆగస్టు 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు స్పెషల్ గిఫ్ట్ కి మంచి ప్లానులోనే ఉన్నారట.  మరి ఈ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: