అందం అభినయం కలగలిసిన ముద్దుగుమ్మ రేఖ వేదవ్యాస్. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఆనందం సినిమాలో హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ఈ అమ్మడు. ఈ సినిమాలో ఆకాష్ కి జోడీగా నటించింది. ఇక మొదటి సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాన్ని దక్కించుకుంది ఈ అమ్మడు. తనదైన చిలిపి నవ్వు తో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టి... తనదైన అందాలతో ఎంతో మంది దర్శక నిర్మాతలను ఆకర్షించింది. అయితే తెలుగులో పలు సినిమాలు చేసినప్పటికీ రేఖ వేదవ్యాస్ కెరియర్ కి అవి అంతగా అచ్చిరాలేదు . దీంతో అటు తమిళ కన్నడ సినిమాల పైనే ఎక్కువ దృష్టి పెట్టింది ఈ అమ్మడు. ఒకానొక సమయంలో తెలుగులో మంచి సినిమా ఆఫర్లు వచ్చినా వరుసగా కన్నడ సినిమాలు చేయడం ద్వారా తెలుగు ఆఫర్స్ నీ  వదులుకోవాల్సి వచ్చింది. 

 

 

 అయితే ఎన్నో రోజులనుండి తెర మీద ఎక్కడా కనిపించడం లేదు ఈ అమ్మడు. ఇక తాజాగా ఈ టీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో గెస్ట్ గా వచ్చింది రేఖ వేదవ్యాస్. అయితే ఇన్నేళ్లు అయినప్పటికీ కూడా రేఖ వేదవ్యాస్ అందం మాత్రం ఇంకా ఎక్కడా తగ్గలేదు రెట్టింపు అయింది అని చెప్పాలి. అదే అందం అదే చిరునవ్వు అదే సొగసు... ఇప్పటికీ చెక్కుచెదరని విధంగా ఉంది రేఖ వేదవ్యాస్ . ఎన్నో రోజుల తర్వాత రేఖ వేదవ్యాస్ తెరమీద కనిపించడం తో అభిమానులు కూడా మురిసిపోయారు. ఈ సందర్భంగా తెలుగులో తన కెరీర్ గ్రాఫ్ ఎక్కువగా లేకపోవడానికి గల కారణాలు  చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. 

 

 

 అప్పట్లో తాను  కన్నడ సినిమాలపైనా ఎక్కువగా ఫోకస్ చేయడం ద్వారా తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేయలేకపోయాను. కన్నడలో వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తెలుగు తమిళ భాషల్లో మంచి సినిమా ఆఫర్లు వచ్చినప్పటికి కూడా వదులుకోవాల్సి వచ్చింది అంటూ తెలిపింది. ఏకంగా మణిరత్నం గారు లాంటి మంచి డైరెక్టర్ సినిమాలు వచ్చినప్పటికీ డేట్స్ ఖాళీ లేక వదులుకున్నాను అంటూ చెప్పింది. సరైన గైడెన్స్ లేకపోవడం వలన కొన్ని అవకాశాలను కోల్పోతే డేట్స్ ని ఎలా సర్దుబాటు చేయాలో తెలియక ఇంకొన్ని అవకాశాలను వదులుకోవాల్సి వచ్చింది అంటూ తెలిపింది. నిన్న మొన్నటి వరకు ముంబైలో ఉన్నాను అని ఎప్పుడు హైదరాబాద్ వచ్చాను అని మరోసారి టాలీవుడ్ రీ ఎంట్రీ  ఇవ్వాలనుకుంటున్నాను అంటూ అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. నాకు తగిన పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తెలిపింది రేఖ వేదవ్యాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: