మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఆనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. అయితే ఈ చిత్రం మొదటి భాగం బాగున్నా.. రెండో భాగంలో కొన్ని సీన్లు అతి చేశారని.. ఇందుకు దర్శకుడే కారణం అని అప్పట్లో ఆయనపై వపన్ ఫ్యాన్స్ తెగ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత ఏపిలో ఎన్నికలు రావడం.. జనసేన పార్టీ తరుపున పవన్ కళ్యాన్ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అంతే కాదు ఆయన రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేయడం కారణంగా ఈ ఓటమి జరిగి ఉంటుందని అప్పట్లో పవన్ కళ్యాన్ తన ఫ్యాన్స్ ని ఉద్దేశించి అన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూనే ఆయన బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ రిమేక్ లో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాన్ మొదటి సారిగా లాయర్ పాత్రలో కనిపించనున్నారు. కాగా ఇప్పటికే కీలక సిన్నవేశాలను షూట్ చేసిన పవన్ కళ్యాణ్ పై తరువాత షెడ్యూల్ లో ఒక పవర్ ఫుల్ కోర్టు సీన్ ను చిత్రీకరించనున్నారట. ఈ చిత్రం మొత్తంలోనే ఈ కోర్టు సీన్ హైలైట్ కాబోతుందట. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ చిత్రంలో క్లయిమాక్స్ లో కోర్టు సీన్లు దుమ్మురేపాయి. ఎన్టీఆర్ ను కొత్తగా చూపించడంతో పాటు ఎన్టీఆర్ లోని నటనను పూర్తిగా దర్శకుడు పూరి రాబట్టడంలో సఫలం అవ్వడంతో ఇప్పటి వరకు ఆ సీన్ ది బెస్ట్ కోర్టు సీన్ గా నిలిచిందని అభిమానులు అంటారు.
ఆ ఒక్క సన్నివేశమే చిత్రం విజయానికి నాంది పలికింది. ఇప్పటి వరకు కోర్టు సీన్లు ఎంతో పవర్ ఫుల్ గా నిలిచాయి. తాజాగా పవన్ కళ్యాన్ చిత్రంలో కూడా కోర్టు సీన్లు చాలా పవర్ ఫుల్ గా ఉంబడోతున్నట్లు సమాచారం. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడనున్న తొలి సీన్ ఫైట్ కావడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే విషయమే. అలాగే ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.