సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క ,రంజీ క్రికెటర్ ను పెళ్లి చేసుకోనుందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ క్రికెటర్ నార్త్ కు చెందినవాడని  ప్రస్తుతం రంజీల్లో ఆడుతున్నాడని ఇలా రక రకాల వార్తలు వచ్చాయి. దాంతో ఆ క్రికెటర్ ఎవరో తెలుసుకోవాలని అనుష్క ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇక ఇప్పుడు ఆ అవసరం లేదు ఎందుకంటే అది ఫేక్ న్యూస్.. స్వయంగా అనుష్కనే ఈ వార్తలను  కొట్టిపారేసింది.  
 
తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనుష్క తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. క్రికెటర్ ను పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి నిజమేనా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఎవరు చెప్పారు క్రికెటర్ ను పెళ్లి చేసుకోనున్నానని అవ్వన్నీ రూమర్లు మాత్రమే అని చెప్పిన అనుష్క ... త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నానని అయితే అది పెద్దలు కుదిర్చిన సంబంధమే అవుతుందని అనుష్క వెల్లడించింది. దాంతో అనుష్క పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చినట్లైంది. 
 
ఇదిలావుంటే బాహుబలి 2 తరువాత అనుష్క సినిమాలను తగ్గించేసింది. రెండేళ్ల క్రితం భాగమతి తో వచ్చిన అనుష్క ఈఏడాది నిశ్శబ్దం తో ప్రేక్షకులముందుకు రానుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో మాధవన్ , సుబ్బరాజు, అంజలి , షాలిని పాండే తో పాటు హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్  ముఖ్య పాత్రల్లో కనిపించనుండగా కోన వెంకట్, టిజి విశ్వ ప్రసాద్  నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న  తెలుగు తోపాటు తమిళ, మలయాళ ,హిందీ భాషల్లో విడుదలకానుంది. ఇక ఈసినిమా తరువాత అనుష్క ఇంతవరకు మరో సినిమాకు సైన్ చేయలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: