చివరిగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో అతిథి పాత్ర పోషించిన అనుష్క చివరి చిత్రం మాత్రం 2018 లో విడుదలైన 'భాగమతి' నే. అప్పటినుండి అనుష్క అభిమానులంతా ఆమెను ఎప్పుడూ ఎప్పుడూ సిల్వర్ స్క్రీన్ పైన పూర్తి స్థాయి పాత్రలో చూస్తామా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అప్పటినుండి ఆమె ఆ సినిమా చేసింది... ఈ ప్రాజెక్టులో తీసుకున్నారని రూమర్లు రావడమే తప్పించి ఇప్పటివరకు సరిగ్గా ఒక్క రిలీజ్ డేట్ కూడా వదల్లేదు.

 

అయితే వారి నిరీక్షణకు తెర దించుతూ ఆమె తాజాగా నటించిన నిశబ్దం చిత్రం యొక్క రిలీజ్ డేట్ ను విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఆ సినిమా కాస్తా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. నిశ్శబ్దం చిత్రానికి కోన వెంకట్ కథను రాయగా హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అనుష్క చెవిటి మరియు మూగ అమ్మాయి క్యారెక్టర్ పోషిస్తోంది. థ్రిల్లర్ జోనర్ గా సాగే ఈ చిత్రం ఏప్రిల్ 2వ తేదీన విడుదల కానున్నట్లు అనౌన్స్ చేశారు.

 

అయితే చాలా రోజుల తర్వాత తన అభిమానుల ముందు కనిపించబోతున్నానని ఆనందం వ్యక్తం చేసిన అనుష్క కూడా ఆ చిత్రం రిలీజ్ డేట్ పైన హుషారుగా స్పందించి గా ఇప్పుడు మళ్ళీ కోన వెంకట్ దర్శకుడు హేమంత్ చిత్రానికి కథకు సంబంధించి అనేక కరెక్షన్ లు చెబుతున్నాడట. ఎడిటింగ్ బృందానికి విపరీతమైన పని పెంచేసిన కోన వెంకట్ అవసరమైతే కొన్ని సీన్లు రీషూట్ చేద్దామని సలహాలు ఇస్తున్నారట. ఇప్పటికే 'సైజ్ జీరో' చిత్రానికి భారీగా బరువు పెరిగి పోయి నానా కష్టాలు పడి బరువు తగ్గి తక్కువ సినిమాలు చేస్తున్న అనుష్క కు ఇది చాలా విసుగు తెప్పించే విషయం.

 

కోన వెంకట్ చేస్తున్న పనులు మరియు ఈ చిత్రం ఇంకా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున కొత్త రిలీజ్ డేట్ వచ్చేవరకు అనుష్కకు కోనవెంకట్ విలన్ గానే కనిపిస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: