ఇటివల హీరోయిన్ మెహరీన్ తీరుపై సోషల్ మీడియాలో పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. నాగశౌర్య హీరోగా వచ్చిన అశ్వద్ధామ సినిమాకు ఆమె ప్రమోషన్లకు రాకపోవడం దగ్గర నుంచీ హోటల్ బిల్లులు, తిండి ఖర్చులకు సంబంధించి పలు వార్తలు వచ్చాయి. దీంతో మెహరీన్ కు సినిమా నిర్మాతలకు మధ్య విబేధాలు వచ్చాయని ప్రచారం జరిగింది. దీంతో.. ఇప్పుడు మెహరీన్ ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతూ తనదైన వివరణ ఇచ్చింది.

 

 

‘అశ్వథ్థామ సినిమాకు సంబంధించిన సంక్రాంతి ప్రమోషన్లు పూర్తైన తర్వాత నేను  నా కుటుంబాన్ని కలిసేందుకు పంజాబ్ వెళ్లాను. తర్వాత సినిమా రిలీజ్ కు ముందు మళ్లీ ప్రమోషన్ల కోసం నేను హైదరాబాద్ వచ్చాను. మా తాతగారికి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి హాస్పిటల్ లో ఉన్నా కూడా నేను ప్రమోషన్లలో పాల్గొన్నాను. ఇదే విషయాన్ని హీరో నాగశౌర్య కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తర్వాత నాకు స్కిన్ ఎలర్జీ వచ్చి ఓ ఇంటర్వ్యూకు రాలేకపోయాను. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో సహా నా ఇబ్బందిని నిర్మాతలకు పంపించి క్షమాపణలు కూడా కోరాను. కానీ.. నిర్మాతలకు ఇది నచ్చక నా హోటల్ బిల్లులు కట్టలేదు. నా మేనేజన్ ఫోన్ చేసినా వారు స్పందించకపోవటంతో నేనే ఆ బిల్స్ అన్నీ క్లియర్ చేశాను’ అని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

 

 

ఇప్పటికి 14 సినిమాలు చేశానని ఏ నిర్మాణ సంస్థతో కూడా ఇబ్బందులు రాలేదని మెహరీన్ ఆ లెటర్ లో తెలిపింది. తనపై వచ్చిన వార్తలకు ఇప్పటివరకూ మౌనం వహించానని.. తన తిండి, లాండ్రీ ఖర్చులంటూ వచ్చిన వార్తలు తనను బాధించాయని మెహరీన్ తన ఆవేదన వ్యక్తం చేసింది. వాస్తవం తెలపాలనే ఉద్దేశ్యంతోనే నేను ఈ క్లారిటీ ఇస్తున్నానని.. ఇక ఈ విషయంపై స్పందించనని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: