తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలతో సూపర్ హిట్ చిత్రాలు అందించిన డైరెక్టర్ శ్రీను వైట్ల గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు.  రవితేజ హీరోగా వచ్చిన నీకోసం చిత్రంతో తన ప్రస్థానం మొదలు పెట్టినప్పటికీ.. ఆనందం చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు.  అల్లరి ప్రేమ.. ఆ తర్వాత ఎమోషన్ అయితే ఎలా ఉంటుందో అన్న కాన్సెప్ట్ తో అప్పట్లో యూత్ ని బాగా ఆకట్టుకున్నాడు శ్రీను వైట్ల. తర్వాత సొతం, వెంకి, దుబాయ్ శీను, రెడీ, దూకుడు, బాద్ షా లాంటి బిగ్గెస్ట్ హిట్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా మారారు.  అయితే ఎలాంటి డైరెక్టర్ అయినా.. నటుడు అయినా ఓ బ్యాడ్ టైమ్ అనేది వెంటాడుతుంది.

 

మహేష్ బాబు తో ‘ఆగుడు’ చిత్రం తర్వాత ఈ డైరెక్టర్ కి బ్యాడ్ టైమ్ మొదలైంది.  వరుసగా బ్రూస్ లీ, మిస్టర్ గత ఏడాది రవితేజతో అమర్ అక్బర్ ఆంథోని చిత్రాలతో వరుస పరాజయాలు పొందాడు. దాంతో శ్రీను వైట్ల కెరీర్ పూర్తయ్యిందని టాక్ వచ్చింది.  కానీ ఆయన మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా శ్రీను వైట్ల మెగాస్టార్ చిరంజీవిని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.  ఈ నేపథ్యంలో  షూటింగ్ జరుగుతున్న లొకేషన్ కి శ్రీను వైట్ల వెళ్లి కలిసినట్టుగా తెలుస్తోంది. తన దగ్గరున్న లైన్ ను చిరూ చెవిన వేయడానికే శ్రీను వైట్ల వెళ్లాడనే టాక్ వినిపిస్తోంది.

 

గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో చిరంజీవి ‘అందరివాడు’ చిత్రంలోనటించాడు.  ఈ చిత్రం అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. అయితే ఆ లైన్ ను ఆయన చిరూ కోసమే అనుకున్నాడా? లేదంటే మెగా ఫ్యామిలీలో వేరే హీరోతో అనుకున్నాడా? అనేది తెలియాల్సి వుంది. గతంలో మెగా హీరోలతో మిస్టర్, బ్రూస్ లీ లాంటి డిజాస్టర్ చిత్రాలు తీశారు శ్రీను వైట్ల. 

మరింత సమాచారం తెలుసుకోండి: