ఒకప్పుడు శ్రీను వైట్ల సినిమా వస్తుందంటే ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది ఇప్పుడు శ్రీను వైట్ల వస్తున్నాడంటే మీడియం రేంజ్ హీరోలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు అట్టప్ ఫ్లాప్ లు చవిచూసిన శ్రీనువైట్ల మరో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అసలే ఛాన్సులు లేకపోవంతో ఏదోలా రవితేజను పట్టుకుని అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా చేస్తే అది శ్రీను ఉన్న పరువు కూడా గంగలో కలిపేసింది.
అసలు చిన్నా చితకా హీరోలే శ్రీను ను పట్టించుకునే పరిస్థితి లేదంటే మనోడు ఏకంగా స్టార్ హీరోలతో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇక ఇండస్ట్రీలో వినిపిస్తోన్న రూమర్ల ప్రకారం గత వారంలో మహేష్ బాబును కలిసి శ్రీనువైట్ల కథను వినిపించాడట. దూకుడు స్థాయిలో మరో విజయాన్ని మీకు ఇస్తానంటూ నమ్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడట. మహేష్ మాత్రం ప్రస్తుతం తాను చాలా ప్రాజెక్టులు కమిట్ అయ్యానని.. అవి అయ్యాక చూద్దామని చెప్పి పంపాడట.
మహేష్ను ఎంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా మహేష్ వినకపోవడంతో శ్రీను వైట్ల ఎంతో నిరాశతో బయటకు వచ్చినట్టు కూడా మ్యాటర్ బయటకు లీక్ అయ్యింది. ఇక తాజాగా చిరంజీవిని కూడా శ్రీనువైట్ల కలిసినట్లుగా సమాచారం అందుతోంది. చిరు ఏమైనా ఛాన్స్ ఇస్తాడా ఏంటి ? ఎంచక్కా స్టోరీ విని స్టోరీ లైన్ చాలా బాగుంది.. నాకు ఇప్పుడు ఖాళీ లేదు అని చెప్పి పంపాడట. గతంలో చిరుతో శ్రీను వైట్ల అందరివాడు సినిమా చేసిన సంగతి తెలిసిందే.
ఇక అంతకు ముందే రామ్ను కలిస్తే రామ్ కూడా ఇప్పుడు ఖాళీ లేదండి... తర్వాత చూద్దాం అని చెప్పి పంపాడట. దీనిని బట్టి చూస్తే శ్రీను వైట్లతో కనీసం మాట్లాడేందుకు కూడా హీరోలు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఏదమైనా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వైట్ల పరిస్థితి ఇప్పుడు ఇలా రావడం బాధాకరం. మరో హిట్తో ఈ కామెడీ డైరెక్టర్ పునర్వైభవం సాధించాలని ఆశిద్దాం.