ప్రముఖ హీరో నితిన్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'భీష్మస. ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. కేవలం వారం కూడా తిరగక ముందే మంచి కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ రికార్డులను బద్దల కొట్టింది. నితిన్ కి చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే చాలా మంది నితిన్ ఫ్యాన్స్ తనకు ఎంగేజ్మెంట్ అయింది మంచిగా కలిసొచ్చింది అంటున్నారు. మరికొంత మంది అయితే పెళ్ళైతే ఇంకెంత కలిసొస్తుందో అంటున్నారు.
ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ చిత్ర విజయోత్సవం ఈ రోజు హైదరాబాద్లోని దస్పల్లా హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. అందులో రష్మిక మండన్నమాట్లాడుతూ... ఈ మూవీని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు చాలా థాంక్స్. క్రిటిక్స్ మంచి రివ్యూస్ ఇచ్చారు. ఇందులో నాకొక మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు వెంకీకి రుణపడి ఉంటాను. 'భీష్మ' పాత్రలో నితిన్ ను చూసినప్పుడు అతని అభిమానిని అయిపోయాను. సినిమాలో అతను కనిపించిన తీరునూ, అతని నటననూ నిజంగా ఇష్టపడ్డాను. మంచి మ్యూజిక్, చక్కని సినిమాటోగ్రఫీతో అన్నీ చక్కగా కుదిరిన సినిమా ఇది. నాకు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్" అన్నారు.
మరి ఈ చిత్రం తో నితిన్కి రష్మిక ఫిదా అయిందనే చెప్పాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ విజయోత్సవ వేడుకలో సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ చిత్ర బృందం పాల్గొన్నారు.
హీరో నితిన్ మాట్లాడుతూ... "సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థాంక్స్. మా టీం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న హిట్ ఇది. నితిన్ బాగా నవ్వించాడు, బాగా చేశాడంటుంటే హ్యాపీగా ఉంది. రష్మికతో కంటే సంపత్ రాజ్ తో నా కెమిస్ట్రీ ఇంకా బాగా వర్కవుట్ అయ్యిందని అంటున్నారు. కాసర్ల, శ్రీమణి చాలా మంచి పాటలు ఇచ్చారు. 'ఛలో'తో వెంకీకి, 'భీష్మ'తో నాకు రష్మిక బ్రేక్ ఇచ్చింది అని అన్నారు.