టాలీవుడ్ చుల్ బులి సమంత అక్కినేని, ఇప్పటికే ఈ ఏడాది జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శర్వానంద్ హీరోగా సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన రేంజ్ లో విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. ఇక తొలి సినిమా ఏ మాయ చేసావే తో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన సమంత, ఫస్ట్ మూవీతో మంచి సక్సెస్ ని అందుకోవడంతో పాటు తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను, మరీ ముఖ్యంగా యువతని విపరీతంగా ఆకట్టుకుంది అనే చెప్పాలి.
ఇక అక్కడి నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుని ముందుకు సాగిన సమంత, ఇప్పటివరకు దాదాపుగా అందరు స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ని అందిపుచ్చుకుంది. అక్కినేని నాగచైతన్యతో వివాహం తరువాత ఒకింత సెలెక్టీవ్ గా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న సమంత, రేపటి తో టాలీవుడ్ కి నటిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్ గా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆమె ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఒక పెద్ద ట్రెండ్ ని రేపు క్రియేట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సమంత సీడీపీ(కామన్ డిస్ ప్లే ఫోటో)ని కాసేపటి క్రితం రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేస్తూ, సమంత వంటి టాలెంటెడ్ నటులు మన టాలీవుడ్ కి ఎంతో గొప్ప వరం అని, అలానే ఆమె మరిన్ని సంవత్సరాలు నటిగా సక్సెస్ఫుల్ గా కొనసాగాలని కోరుకుంటూ పోస్ట్ చేసారు రకుల్.
దీనితో సమంత ఫ్యాన్స్ అందరూ కూడా రకుల్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇకపోతే ఈ విధంగా ఒక స్టార్ హీరోయిన్ కోసం మరొక స్టార్ హీరోయిన్ తన వంతుగా సాయం అందించడం నిజంగా టాలీవుడ్ లో ఆరోగ్యకరమైన పోటీకి నిదర్శనం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక సినిమాల్లోకి ప్రవేశించి 10 సంవత్సలు పూర్తి కావడంతో సమంత కూడా రేపు కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమాచారం. మొత్తానికి సమంత మన తెలుగు ప్రేక్షకులను మాయ చేసి అప్పుడే పదేళ్లు గడిచిందా అంటూ కొందరు ఫ్యాన్స్ సరదాగా ఆమెపై సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.....!!!
Super happy to launch #10YearsForSamanthaMania ❤️❤️ @Samanthaprabhu2 is one one the nicest and most talented actors I have seen and there is soooo much I look upto her for .. lots of love sam and here is to many more years 😀😀 pic.twitter.com/NmckF3TaWl
— rakul Singh (@Rakulpreet) February 25, 2020