ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. క్రేజ్ ఉండటం ఫాలోయింగ్ ఉండటంతో మంచి సినిమాలు చేస్తూ ముందుకి వెళ్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అయితే సినిమాను ఓకే చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ అది ప్రయోగం అయినా సరే వెనుకాడటం లేదు. ముఖ్యంగా రామ్ చరణ్ ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అవుతున్నాడు. రంగస్థలం సినిమాలో అతని పాత్ర చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆ సినిమాలో అతని పాత్ర హైలెట్ గా నిలిచింది. 

 

అతని నటన చూసి విమర్శకులు కూడా ఫిదా అయిపోయారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లో కూడా రామ్ చరణ్ అదే విధంగా నటిస్తున్నాడు. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుంది. ఇక ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగులో 13బి, ఇష్క్, మనం, 24, గ్యాంగ్ లీడర్’ వంటి చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని ఏర్పరుచుకున్న విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

 

ఇప్పటికే విక్రమ్ కుమార్.. చరణ్‌ను కలిసి ఒక లైన్ వినిపించి ఓకే చేయించుకున్నాడు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ సినిమాకు తానే నిర్మాతగా ఉంటాను అని చెప్పాడట చెర్రీ. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టినరోజున మార్చి 27న అఫీషియల్ ప్రకటించే అవకాశం ఉంది. మాస్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ తో విక్రం కుమార్ ఏ విధంగా సినిమా చేస్తాడు అనేది చూడాల్సి ఉంది. త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: