ఛలో సినిమా దర్శకుడు వెంకీ కుడుమల రీసెంట్గా తెరకెక్కించిన చిత్రం `భీమ్మ్` ఈ చిత్రం విడుదలై మంచి సక్సెస్ను సాధించింది. అయితే గతంలో ఆయన దర్శకత్వం వహించిన `ఛలో` చిత్రం కూడా మంచి విజయం సాధించింది. అయితే ఆ చిత్ర కథ మాత్రం తనది కాదంటూ అప్పట్లో నాగశౌర్య ఆ కథ తనదంటూ చెప్పాడు. ఇక ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఎందుకోగాని వారిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్దలు వచ్చాయి. దాంతో శౌర్య ఓరోజు వెంకీ కుడుమల గురించి కామెంట్ చేయడం మొదలు పెట్టాడు.
ఛలో స్క్రిప్ట్ తానే దగ్గరుండి రాయించానని చెప్పాడు. సినిమా హిట్ అయ్యాక తనతో టచ్ లో లేడని అలాగే శౌర్య వాళ్ళ అమ్మ ఉషాముల్పూరి కారు గిఫ్ట్ గా ఇస్తే అది కూడా అమ్మేశాడని నాగశౌర్య ఓ ఇంటర్వ్యూల్లో చెప్పాడు. దాంతో వీరిద్దరి మధ్య ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదే విషయంపై దర్శకుడు వెంకీ ఏం మాట్లాడకుండా సైలైన్స్ మెయిన్టెయిన్ చేశాడు. ఇక ఇదిలా ఉండగా దస్పల్లాలో జరిగిన భీష్మ సక్సెస్ మీట్ లో శౌర్య పేరు మరోసారి హైలైట్ అయింది.
అయితే ఈ సారి శౌర్యపై పంచ్ వేశాడు హీరో నితిన్. వెంకీ కుడుముల స్పీచ్ ఇస్తుండగా చివర్లో మైక్ తీసుకుని.. ఈ స్క్రిప్ట్ నీదేనా ? అంటూ కామెంట్ చేసాడు. దీంతో ఈవెంట్ లో నితిన్ వేసిన పంచ్ హాట్ టాపిక్ గా మారింది. శౌర్య మీద నితిన్ ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేశాడంటూ చర్చ నడిచింది. సో ఏది ఏమైన సినిమా కథ పక్కనపెడితే అది అందిరికీ నచ్చేలా తెరకెక్కించడం కత్తిమీదా సాములాంటిదే. ఛలో కథ ను అందరికి నచ్చేలా వెంకీ తెరకెక్కించాడు. తర్వాత అతని గురించి శౌర్య నెగిటివ్ గా మాట్లాడకుండా ఉండిఉంటే బావుండేది. కానీ ఇప్పటి వరకు ఏ హీరో కూడా అలా మాట్లాడకూడదు. ఇక ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. అందుకే హిట్ అయింది కాబట్టి కథ తనదే అని చెప్పుకుంటున్నావు. అదే ప్లాప్ అయ్యి ఉంటే దర్శకుడి మీదకు తొసి ఉండేవాడివి కదా శౌర్య అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఎలాగైనా ఓ యంగ్ హీరో అందులోనూ మంచి పేరు తెప్పించుకోవాలని అందరూ అంటున్నారు.