స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో చిత్రం అల.. వైకుంఠపురములో ఈ సంక్రాంతికి విడుదలై 150కోట్ల షేర్  వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీ  హిట్ గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికి ఈ సినిమా వీకెండ్ లో పర్వాలేదనే వసూళ్లను రాబడుతుంది. ఇక ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. అయితే 50రోజుల థియేట్రికల్ రన్ కూడా పూర్తి కాకముందే సన్ నెక్స్ట్, డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయడానికి  రెడీ అయిపోయింది.
 
అందులో భాగంగా రేపు ఈ సినిమా  డిజిటల్ రిలీజ్ కావాల్సి వుంది అయితే ఏమైందో ఏమో ఆ విడుదల వాయిదా పడింది. ఆ విషయాన్ని పోస్టర్  ద్వారా  కమింగ్ సూన్ అంటూ అధికారికంగా ప్రకటించింది సన్ నెక్స్ట్.. ఇక 50రోజుల తర్వాతే డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే ఈ సినిమా నుండి  ఒక్కొక్కటిగా  వీడియో సాంగ్స్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సామజవరగమన, ఓ మై డాడీ సాంగ్స్ విడుదల కాగా తాజాగా ఈరోజు  బుట్ట బొమ్మ సాంగ్ ను  విడుదలచేశారు. అలా రిలీజ్ అయ్యిందో లేదో ఈసాంగ్ అప్పుడే 14లక్షలకు పైగా వ్యూస్ ను 160k లైకులను రాబట్టుకుంది. 
 
పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా థమన్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్ లో నటించనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్ని డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడని టాక్.. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రష్మిక కథానాయికగా నటించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: