పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీకి వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తో కలిసి టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న పింక్ సినిమాకు అధికారిక రీమేక్ గా దీనిని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, నివేత థామస్, మల్లేశం మూవీ హీరోయిన్ అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమాలో పవన్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండనున్నట్లు చెప్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా మే రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇకపోతే ఈ సినిమాకు టైటిల్ గా లాయర్ సాబ్ అనే పేరుని అనుకుంటున్నట్లు ఇటీవల పలు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే దీనిపై సినిమా టీమ్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఇక కొద్దిరోజుల క్రితం దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ టైటిల్ రిజిస్టర్ చేయించడంతో దీనినే పక్కగా టైటిల్ గా పెడతారని అందరూ భావించారు. 

 

అయితే నేడు అందుతున్న వార్తలను బట్టి చూస్తుంటే ఈ సినిమాకు సరిగ్గా సరిపోయే మరొక టైటిల్ ని యూనిట్ సభ్యులు నిర్ణయించడం జరిగిందని, దానిని రాబోయే ఉగాది కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. లాయర్ సాబ్ అనేది కూడా బాగున్నప్పటికీ కూడా, సినిమాలోని కొన్ని ముఖ్య ఘటనలను బట్టి, అలానే కథ సాగే విధానాన్ని బట్టి సరికొత్త టైటిల్ నిర్ణయించడం జరిగిందట. మరి ఇందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే రాబోయే ఉగాది వరకు వెయిట్ చేయాల్సిందే అని సమాచారం.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: