సినీ ప్రపంచం అది ఒక రంగుల మయం. ఒకసారి దానికి అలవాటు పడితే అంతకు మంచి ఎంత మంచి అవకాశం మన జీవితంలో వచ్చినప్పటికీ సినిమాలకంటే ఎక్కువ ఏదీ కాదేమో అనిపిస్తది. ఇక ఈ సినిమా పరిశ్రమ అనేది అదృష్టం కూడా ఓ పక్కన వరించి ఉండాలి ఎవరికైనా. వెంకటేష్ సినిమా సుందరకాండ సినిమాలో నటించిన స్టూడెంట్ క్యారెక్టర్ అపర్న అందరికీ గుర్తు ఉండే ఉంటది. అందులో స్టూడెంట్గా ఓ మాస్టార్ని ఆట పట్టించే పాత్రలో అందరినీ మెప్పించింది. ఈ సినిమా తర్వాత మరే సినిమాలోనూ కనిపించకుండా పోయింది. అలాగే చిరంజీవి సినిమాలో ఆపద్బాంధవుడులో నటించిన ఈమె కూడా అప్పటి ఆ చిత్రం వంద రోజులు ఆడింది. కానీ ఆ సినిమా తర్వాత మరే సినిమాలోనూ నటించే అవకాశం రాలేదో లేక తానే నటించలేదో అర్ధం కాలేదు. వీరిద్దరూ మరే సినిమాలోనూ కనపడకుండా కనుమరుగైపోయారు.
ఇక ఇదిలా ఉంటే బన్నీతో కలిసి పరుగు చిత్రంలో నటించిన షీలా ఆ చిత్రం తర్వాత హీరో రామ్, ఎన్టీఆర్, బాలకృష్ణలతో కలిసి నటించింది. ఇక స్టార్ హీరోయిన్ స్థానంలో అడుగుపెట్టబోతుంది అనుకునే సమయంలో సడెన్గా సినిమాల్లో నటించడం ఆపేసింది. విషయం ఏమిటని ఆరా తీయగా ఓ బడా ప్రొడ్యూసర్ చేతిలో కీలు బొమ్మ అయి ఆమె మరే సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదని వార్తలు నడిచాయి. అలాగే ఆ నిర్మాత ఆ అమ్మాయి సినిమాల్లో నటించకుండా తన పర్సనల్గా పెట్టేసుకున్నాడని. తనకు ఏం కావాలో చెప్పు అంతే సినిమాలు వద్దు అంటే ఆమె ఆ నిర్మాత మాటలకు సరేనని నటించడం మానేసింది. అతను ఓ బడా ప్రొడ్యూసర్ మాత్రమే కాదు. ఓ పెద్ద డిస్ట్రిబ్యూటర్ కూడా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కాని షీలాది ఇప్పుడు దారుణ పరిస్థితిలో ఉందని సమాచారం. చిన్న వయసులోనే ఆమె ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. సినిమాలకు అలవాటు పడిన ఆమెకు బంధీగా ఉండటం సహించలేక చెడు అలవాట్లకు దగ్గరై పూర్తిగా తన ఆరోగ్యాన్ని దూరం చేసుకుంది.