ప్రీతి జింగానియా ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు. తెలుగులో తమ్ముడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ప్రీతి ముంబయిలోని సింఘ్ ఫ్యామిలీలో పుట్టిపెరిగింది. మొదట్లో తాను ఏహీ ప్రేమ్ అనే మ్యూజిక్ ఆల్బ్మ్లో అబ్బాస్ కి పెయిర్గా నటించింది. ఆ తర్వాత నిర్మాశాండిల్ సోప్కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. ప్రీతి జింగానియా బాలీవుడ్లో మొహబత్తేన్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రీతి ఆవారా, పాగల్, దీవానా అనే చిత్రాల్లో నటించి బాలీవుడ్లో మంచిపేరు సంపాదించుకుంది. కాని బాలీవుడ్లో మాత్రం సక్సెస్ఫుల్ హీరోయిన్ అవ్వలేకపోయింది ప్రీతి జింగానియా. తమ్ముడు మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రీతి ఆ మూవీ సూపర్డూపర్ హిట్ అవ్వడంతో అందరూ మంచి పొజీషన్కి వస్తది అనుకున్నారు.
కానీ ఆ తర్వాత అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్, ఆనందమానందమాయే. ఆ మూవీస్ పెద్దగా హిట్ అవ్వకపోవడంతో ప్రీతికి తెలుగులో ఎక్కువగా అవకాశాలు రాలేదు. యమదొంగ మూవీలో చివరికి ఐటమ్ సాంగ్ కూడా చేసింది. ప్రీతి పర్వీన్ దర్బార్ అనే అతన్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ప్రీతికి పర్వీన్కి కలిసి జయదేవ్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే వివాహం తర్వాత కూడా ప్రీతి సినిమాల్లో నటిస్తుంది. అయితే ప్రొడ్యూసర్ గా కూడా ఒక సినిమాని నిర్మించింది. ఆ చిత్రం హిట్ సంగతి పక్కన పెడితే... అన్నీ నష్టాలే వచ్చాయి. అయితే ఈ తమ్ముడు మూవీ హీరోయిన్ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోందట. అలాగే బాలకృష్ణతో కలిసి నరసింహనాయుడులో నటించింది. మరి బాలయ్యతో నటించిన తర్వాత ఏ హీరోయిన్ కూడా ఖాళీగా లేరు. మరి ప్రీతి మాత్రం అందుకు విరుద్ధంగా బాలయ్యతో నటించినా అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. మరి అలా కనుమరుగైన వాళ్ళలో చాలా మందే ఉన్నారు. కొంత మంది హీరోయిన్లు అంతే మంచి పాత్రలు వస్తున్నాయి అనుకునేలోపే కనుమరుగయిపోతున్నారు.