సూపర్ స్టార్ మహేష్ కథ ని ఫైనల్ చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆయన నుండి వరుసగా బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయి. ఏ విషయంలో కాంప్రమైజ్ అయినప్పటికి కథ, కథనాల విషయంలో అసలు కాంప్రమైజ్ కారు మహేష్. తనకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా .. హిట్లు ఇచ్చిన వాళ్లు అయినా..  ఎంత గొప్ప దర్శకుడు అయినా సరే ముందు మహేష్ బాబు కి స్క్రిప్టు చాలా ముఖ్యం. ఆ విషయంలో ఏ మాత్రం ఆలోచించకుండా పూరి జగన్నాధ్ - సుకుమార్ లాంటి డైరెక్టర్లను రిజెక్ట్ చేశారు. ఇప్పుడు అలానే మహర్షి ఫేం వంశీ పైడిపల్లి ని రిజక్ట్ చేశారు సూపర్ స్టార్. అయితే ఆ సంగతి ఆ నోటా ఈ నోటా పడి మీడియాకి లీకైంది. దాంతో ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

 

అయితే ఈ విషయంలో వంశీ చాలా హర్ట్ అవుతున్నారట. ఎందుకంటే సినిమా మహేష్ క్యాన్సిల్ చేసినందుకు కాదట. సోషల్ మీడియాలో అనవసరంగా ఏవేవో రాసేస్తున్నారని... వంశీ పైడిపల్లి తన సన్నిహితులతో చెప్పుకుని బాధపడ్డారట. వాస్తవంగా మహేష్ వంశీ కథను కంప్లీట్ గా రిజక్ట్ చేయలేదు. కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ కలవమని చెప్పారు. కానీ మీడియా మాత్రం ఇందుకు భిన్నంగా రాస్తున్నందుకు బాధ కలుగుతోందట.  ఇక మహేష్ - పైడిపల్లి మధ్య క్లోజ్ నెస్ ఏంటో అందరికీ తెలిసిందే. మహర్షి రిలీజ్ తర్వాత ఇద్దరి మధ్య ఆ క్లోజ్ నెస్ మరింతగా బలపడింది.

 

కాని ఇక్కడ స్నేహం వేరు సినిమా వేరు. ఇది మహేష్ బాబు మాత్రమే కాదు ఏ హీరో అయినా ఇలాగే ఆలోచిస్తాడు. అందుకే తనకు  స్క్రిప్టు నచ్చలేదు అని మహేష్ చెప్పినప్పుడు.. వేరే కథలు వినండి అని ఆయనే స్వయంగా సలహా ఇచ్చారట. కానీ మీడియా ఇలా పైడిపల్లిని ట్రోల్ చేయడంతో చాలా బాధ పడుతున్నారట. ఇంతక ముందు తెరకెక్కించిన మహర్షి సినిమాని పూర్తిగా కమర్షియల్ ఫార్మాట్ లో తీయడంలో పైడిపల్లి ఫేయిలయ్యారని మహేష్ బాబు ఫ్యాన్స్ కొంతమంది ఫీలయ్యారు కూడా. అది కూడా ఇప్పుడు మహేష్ రిజక్ట్ చేయడానికి కారణమని అంటున్నారు. ఇక ప్రాజెక్ట్ ఇప్పటికి క్యాన్సిల్ అయినా వంశీ పైడిపల్లి ఎంతో కసితో మళ్ళీ మహేష్ ని ఒప్పించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారట. మరి కొత్త వర్షన్ మహేష్ కి నచ్చి ఒకే అంటాడా లేదా చూడాలి. ఈ విషయంలో దిల్ రాజు మహేష్ బాబుని కన్విన్స్ చేయడానికి  చేశాడట. కాని మహేష్ ససేమిరా అనడంతో వంశీ పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: