అజ్ఞాతవాసి సినిమా తర్వాత అతి పెద్ద డిజాస్టర్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్దీ ఏళ్ల నుండి సినిమాలకు దూరంగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిన పవన్ ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికోల్లో జనసేన పార్టీ  తరపున పోటీ పరాజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుండి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వస్తున్నారు. 

 

 


జనం లో తిరుగుతూ జన సమస్యలను తన సమస్యలు గా పోరాడుతూ వస్తున్నారు. అయితే తాజాగా పవన్ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హిందీలో భారీ విజయాన్ని అందుకున్న పింక్ రీమేక్ సినిమాలో నటిస్తున్నారు. వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో దిల్ రాజు, బోణీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. 

 

 


ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే.. అయితే సినిమా మొదలైన అప్పటి నుండి ఇప్పటివరకు సినిమాలోని కీలక సన్నీ వేశాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. పవర్ సినిమా పై భారీ అంచనాలు ఎక్కువగా ఉన్నాయ. కానీ సినిమాకు లీకుల బెడద మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. 

 

 

ప్రస్తుతం శరవేగంగా సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా అన్నపూర్ణ 7ఎకరాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా, బోని కపూర్, దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా షూటింగ్. ప్రత్యేకంగా వేసిన సెట్ లో కోర్టు సీన్లు ఈ నెల 30వరకు చేయనున్నారు.
మళ్లీ షెడ్యుల్ మార్చి 20 నుంచి జరుగనుంది. క్రిష్ సినిమా షూటింగ్ మార్చి 1నుంచి మార్చి 20 వరకు జరుగనుంది.వరుస సినిమాలలో నటిస్తున్న పవన్ ఈ సినిమాలు హిట్ అయితే మళ్ళీ బిజీ అవుతాడని చిత్ర వర్గల్లో వినపడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: