ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన అంశాల్లో ముఖ్యమైంది వంశీ పైడిపల్లితో మహేశ్ సినిమా క్యాన్సిల్ కావడమే. మహర్షితో వీరిద్దరి స్నేహం పీక్స్ కి వెళ్లింది. ఆ సినిమా బ్రహ్మాండమైన హిట్ కాకపోయినా ఆడింది. దానికే.. సినిమా సక్సెస్ ఫంక్షన్ లో వంశీకి మహేశ్ ముద్దు కూడా పెట్టాడు. సరిలేరు.. తర్వాత వంశీతో సినిమా అని అనౌన్స్ చేశాడు. ఇప్పుడు వంశీ చెప్పిన స్క్రిప్ట్ నచ్చకపోవడంతో పక్కన పెట్టేశాడు. స్నేహం కాదు.. సక్సెస్ ముఖ్యం అని తేల్చేశాడు. ఇది నిజమే అయినా.. మహేశ్ తీరుతో మరో ఇద్దరు డైరక్టర్లు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు.

 

 

ఈ వార్తలను వీరిద్దరూ ఖండించకపోవడంతో ఇదే నిజమని అంటున్నారు. కానీ మహేశ్ నే నమ్ముకుని సినిమా ఉంటుదనుకున్న వంశీకి ఇది ఇబ్బందికర పరిస్థితే. ఇప్పటికిప్పుడు సినిమా ఇచ్చే హీరో లేడు. ఏడెనిమిది నెలలుగా వీరిద్దరూ కలిసే టూర్లకు వెళ్లారు.. ఫ్యామిలీలతో వెకేషన్స్ కు వెళ్లారు. వీరిద్దరి కూతుళ్లు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. మరి.. మహేశ్ తీరుకి వంశీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుకుమార్ ను కూడా దాదాపు రెండేళ్లు వెయిట్ చేయించి అనిల్ రావిపూడితో సినిమా అనౌన్స్ చేశాడు మహేశ్. సుకుమార్ కు బన్నీ ఉన్నాడు కాబట్టి వెంటనే తేరుకుని సినిమా చేయగలుగుతున్నాడు.

 

 

మహేశ్ తీరు గురించి ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్ లో పూరి చేసిన వ్యాఖ్యాలను ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ హైలైట్ చేస్తున్నారు. జనగణమణ సినిమా మహేశ్ తో చేస్తున్నానని పూరి చెప్పుకున్నాడు కూడా. ఫ్లాపుల్లో ఉన్నానన్న కారణంతోనే మహేశ్ చేయలేదని పూరినే చెప్పాడు. పూరికి కథలున్నాయి కాబట్టి బతికిపోయాడు. ఇలా మహేశ్ తీరుకు ముగ్గురు డైరక్టర్లు ఇబ్బంది పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: