టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న హీరోయిన్స్ లో రంభ ఒకరు. విజయవాడలో పుట్టిన ఈమె అసలు పేరు విజయలక్ష్మి. ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తి తో సినిమాల్లోకి అడుగు పెట్టి అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఎందరో హీరోల సరసన రంభ ఆడింది, మెప్పించింది. రంభ కోసమే కొందరు దర్శకులు కథలు రాసుకున్నారు. రంభ కోసమే కొందరు పాటలు కూడా రాసిన రోజులు ఉన్నాయి. అయితే ఆమె జీవితం మొత్తం ఎప్పుడు అగమ్య గోచరమే అంటారు ఆమెను దగ్గరగా గమనించిన వారు ఎవరైనా. 

 

సినిమాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత రంభ ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. సదరు వ్యాపారవేత్త ఆమెను మానసికంగా శారీరకంగా హింసించడం, పిల్లలను ఇబ్బంది పెట్టడం తో రంభ అతని తో ఉండలేకపోయింది అంటారు. సినిమాల్లో ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా సరే అతని వ్యవహార శైలి తో రంభ సంతోషంగా ఉండలేక ఇబ్బందులు పడింది అని చెప్తారు. తన నుంచి విడిపోవడానికి ఆమె తన పిల్లలను కూడా ఒకానొక సందర్భంలో వద్దు అనుకుంది అని చెప్తూ ఉంటారు. అయితే పెద్దల జోక్యంతో ఇప్పుడు ఈ ఇద్దరు సంతోషంగానే ఉన్నారట. 

 

ప్రస్తుతం రంభ విదేశాల్లో ఉండి తన భర్త వ్యాపారాలను చూసుకుంటుంది అని చెప్తారు కొందరు. అయితే ఆమె ఎక్కడ ఉంది ఎలా ఉంది అనేది స్పష్టంగా తెలియదు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యు లో కూడా తన భర్త గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రంభ. చాలా మంది అగ్ర నటుల సరసన నటించిన ఆమె ఆ తర్వాత అవకాశాల కోసం వెతుక్కునే పరిస్థితి కూడా వచ్చింది అంటారు. తన భర్త కారణంగా ఆమె ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డారని, కుటుంబ పోషణ ఆమెకు భారం అయిందని చెప్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: