అనుపమా పరమేశ్వరన్... టాలీవుడ్ లో నాలుగేళ్ల క్రితం ఈమె గురించి చాలా చర్చలే జరిగాయి అనేది వాస్తవం. కేరళలో పుట్టిన ఈ హీరోయిన్ మరో సౌందర్య అవుతుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేసారు. ఇక ఆ తర్వాత తమిళంలో తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది ఈ హీరోయిన్. అటు మలయాళంలో కూడా వరుస ఆఫర్లు దక్కించుకుంది. కాని ఆ తర్వాత మాత్రం ఆమెకు అవకాశాలు ఒక్క సారిగా ఆగిపోయాయి. ఆమె వెంటపడిన దర్శకులు ఆమె అడిగినా సరే అవకాశాలు ఇవ్వలేదు అనేది అర్ధమవుతుంది. 

 

ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన ఈ కేరళ కుట్టీ ఇప్పుడు అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంది. దానికి ప్రధాన కారణం ఆమె ఏ హీరో పక్కన కూడా సరిగా సరిపోక పోవడ౦. హీరోల పక్కన ఆమె మరీ చిన్నగా కనపడటంతో ఏ ఒక్క హీరోకి అనుపమా సరైన జోడీ అనిపించుకోలేకపోయింది. చాలా మంది చిన్న హీరోల పక్కన ఆమెను పరిక్షించినా సరే పెద్దగా ఆకట్టుకోలేదు అనుపమా. నటనలో కూడా తేలిపోయింది అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్నో విధాలుగా ఆమెను ట్రై చేసినా సరే పెద్దగా ఆమెలో నటన లేదని భావించి పక్కన పెట్టారు. 

 

మన తెలుగులో ఆమెను బాగానే ఆదరించారు అభిమానులు. కాని ఏమైందో ఏమో తెలియదు గాని ఫాన్స్ కూడా ఆమె వద్దు అంటూ కామెంట్స్ చేసారు. శతమానం భవతి సినిమా తర్వాత శర్వానంద్ పక్కన ఆమెను చూసిన అభిమానులు కోడిపిల్ల మాదిరి గా ఉందని కామెంట్స్ సోషల్ మీడియా లో చేసారు. ప్రస్తుతం ఆమె అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ముందుకి రావడం లేదని అంటున్నారు. దీనితో ఆమె త్వరలోనే పెళ్లి కూడా చేసుకునే ఆలోచనలో ఉందని సమాచారం. ప్రస్తుతం ఒక వ్యక్తితో ప్రేమలో కూడా ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: