ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మీ టూ ఉద్యమం కొనసాగుతుంది.  సామాన్య మహిళలకే కాదు సెలబ్రెటీలకు సైతం లైంగిక వేధింపులు.. అత్యాచారాలపై ప్రతిఘటిస్తున్నారు.  ఈ నేపథ్యంలో భారత్ లో ఆ మద్య బాలీవుడ్ కి చెందిన తనూ శ్రీదత్తా, కంగనా రౌనత్ లు మీటూ ఉద్యమంపై పోరాటం కొనసాగించారు.  కోలీవుడ్ లో సింగర్ చిన్మయి.. తెలుగు లో కాస్టింగ్ కౌచ్ అంటూ శ్రీరెడ్డి.. ఇలా ప్రతి ఒక్కరూ తమపై జరిగిన అన్యాయాలపై పోరాడారు. తాజాగా దశాబ్దాలపాటు సినిమా రంగాన్ని ఏలిన ప్రముఖ హాలీవుడ్ నిర్మాతకు కోర్టు షాక్ ఇచ్చింది.

 

అత్యాచార కేసులో నిర్మాత హార్వే వీన్‌స్టెయిన్‌(67)ను దోషిగా పేర్కొంటూ న్యూయార్క్ కోర్టు తీర్పు ఇచ్చింది.  తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ దాదాపు 80 మంది నటీమణులు 2017లో ఆయనపై ఆరోపణలు చేశారు.  ‘ఐరన్‌మ్యాన్ 3’, ‘ఎవెంజర్స్ ఎండ్ గేమ్’ తదితర చిత్రాల్లో నటించిన గ్వైనెత్ పాల్ట్రో, ‘కిల్ బిల్’ ఫేమ్ ఉమా తుర్మన్, సల్మా హాయేక్ వంటి ప్రముఖ నటీమణులే ప్రజల ముందుకు వచ్చి తమ కష్టాలను చెప్పుకున్నారు. దాంతో 2018 లో ఆయన పోలీసుల ముందు లొంగిపోయారు.  హార్వేపై పలు కేసులు నమోదు అయ్యాయి.

 

వీటిపై సమగ్ర విచారణ జరిపిన న్యూయార్క్ కోర్టు హార్వేను దోషిగా ప్రకటించింది.  ఇదిలా ఉంటే కోర్టు తీర్పు వెలువడిన వెంటనే హర్వేకు గుండెనొప్పి రావడంతో న్యూయార్క్‌లోని బెల్లెవ్యూ ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. ఈ కేసులో తుది తీర్పును మార్చి 11కు వాయిదా వేశారు.  మరోవైపు హార్వే తరఫు న్యాయవాది హర్వేపై ఆరోపణలు చేస్తున్నవారివి నిరాధార ఆరోపణలు అని వాదిస్తున్నారు.  బాధితుల్లో కొంత మంది తమ అంగీకారంతోనే ఆయనతో శృంగారంలో పాల్గొన్నారని.. అలాంటపుడు అవి పరస్పర అంగీకారంతో జరిగిందే.. అలాంటపుడు ఆయన ఎందుకు నేరస్తుడు అవుతారని వాధిస్తున్నారు. కానీ వీరి అంచనాలను తలకిందులు చేసిన కోర్టు హార్వేని దోషిగా ప్రకటించింది. కాగా, హార్వే నిర్మించిన పల్ప్ ఫిక్షన్, గుడ్ విల్ హంటింగ్, ది కింగ్స్ స్పీచ్ తదితర చిత్రాలకు ఆస్కార్ అవార్డులు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: