టాలీవుడ్ లో ఎన్నో అంచనాలతో వచ్చిన హీరోయిన్స్ లో చార్మీ ఒకరు. అగ్ర హీరోల పక్కన మంచి సినిమాలు చేసినా ఆమె దశ మాత్రం తిరగలేదు. నాగార్జున, వెంకటేష్, ఇలా కొందరి పక్కన నటించిన చార్మీ టాప్ హీరోయిన్ అవుతుంది అని భావించారు అందరూ. అయితే పోటీ ఎక్కువగా ఉండటంతో పాటుగా చార్మీ బొద్దుగా ఉండటంతో ఆమెను అవకాశాలు వరించలేదు. అయినా సరే ఆమె మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గకుండా తనకు ఉన్న పరిచయాల ద్వారా టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది ఛార్మీ. 

 

అయినా సరే ఆమెకు అవకాశాలు రాలేదు. ఆ తర్వాత కొన్ని ఐటమ్స్ సాంగ్స్ కోసం ప్రయత్నాలు చేసినా ఫలితం ఆశించిన స్థాయిలో రాలేదు. ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ తో కలిసి ఉంటుంది. ఆయనతో సహజీవనం చేస్తుంది అని కొందరు అంటున్నా కాదు ఆమె ఆయనతో కలిసి సినిమాలు నిర్మిస్తుంది అని ఇప్పుడు నిర్మాతగా బిజీ అయింది అని కొందరు అంటున్నారు. ఒకానొక సందర్భంలో ఆమెపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. అయినా సరే ఎక్కడా భయపడకుండా ఆమె సినిమాల మీద ఆసక్తితో కొనసాగుతుంది. 

 

పూరి జగన్నాథ్ సినిమాల్లో కొత్త హీరోయిన్స్ కి అవకాశాలు ఇవ్వడమే కాకుండా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ కథల సమయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. కథ ఏ హీరోకి ఏ విధంగా ఉంటే బాగుంటుంది... ఏ హీరోకి ఎంత పెట్టుబడి పెట్టవచ్చు, సినిమాను తక్కువకు ఏ విధంగా పూర్తి చేయవచ్చు అనే సలహాలను పూరికి ఇస్తూ ఆయనకు అండగా ఉంది. అయితే ఈ విషయంలో పూరి కుటుంబంలో విభేదాలు కూడా వచ్చాయని వార్తలు వచ్చినా ఛార్మీ మాత్రం పూరికి అందగానే ఉంది. డ్రగ్స్ కేసు సమయంలో కూడా ఆమె పూరి జగన్నాథ్ ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతం పూరితో కలిసి విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: