టాలీవుడ్ లో ఎన్నో అంచనాలు పెట్టుకున్న హీరోయిన్స్ లో సమీరా రెడ్డి ఒకరు. ఆమె టాప్ హీరోయిన్ అవుతుంది అని భావించారు. స్టార్ హీరోలతో సినిమాలు కూడా చేసింది సమీరా రెడ్డి. ఎన్టీఆర్ తో రెండు సినిమాలు, చిరంజీవితో సినిమాలు చేసినా సరే ఆమె మాత్రం ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేదు. దీనికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియకపోయినా ఆమెకు డాన్స్ రాదని, నటన రాదని దర్శకులు పక్కన పెట్టారని అంటే, కాదు పోటీ ఎక్కువగా ఉండటంతోనే ఆమె వెళ్లిపోయింది అంటారు. 

 

మరికొందరు అయితే ఆమె హీరో కంటే ఎత్తు ఎక్కువగా ఉంది కాబట్టి పక్కన పెట్టారని కామెంట్స్ చేసారు. అయితే ఎన్టీఆర్ తో ఉన్న లవ్ అఫైర్ ఆమెను సినిమాలకు దూరం చేసింది అంటారు. అటు బాలీవుడ్ కి వెళ్ళినా సరే ఆమెకు అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదని కొందరు అప్పుడు కామెంట్స్ చేసారు. ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకోవాలని భావించడం అందుకోసం ఎన్టీఆర్ మీద ఆమె ఒత్తిడి కూడా తీసుకురావడం చాలా మందికి నచ్చలేదని, దీనితో ఆమెను పక్కన పెట్టాల్సి వచ్చింది అంటూ కొందరు మాట్లాడారు. 

 

ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి క్రికెటర్ల తో ప్రేమాయణాలు నడిపింది. మరో ఏమైందో ఏమో తెలియదు గాని ఇప్పుడు సైలెంట్ అయిపోయింది ఈ అమ్మడు. ఎన్టీఆర్ పక్కన రెండు సినిమాలు చేసింది సమీరా రెడ్డి. ఆ రెండు సినిమాలు ఫ్లాప్ కావడమే కాకుండా చిరంజీవి పక్కన చేసిన జై చిరంజీవ సినిమా కూడా ఆకట్టుకోలేదు. అందులో ఆమె నటన కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఏది ఎలా ఉన్నా సరే ఎన్టీఆర్ తో ప్రేమ వివాద౦ అవ్వడంతోనే కనుమరుగు అయిపోయింది అనేది సినీ జనాల మాట. ఆ తర్వాత కొన్ని ఐటెం సాంగ్స్ లో కనపడింది సమీరా రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: