టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన హీరోయిన్స్ లో విజయశాంతి ఒకరు. వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోల పక్కన నటిస్తూ, తన నటన, అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా ఆమె ఎదిగిన తీరు ఎందరినో ఆకట్టుకుంది. తెలంగాణా ప్రాంతానికి చెందిన విజయశాంతి ఎందరో స్టార్ హీరోల పక్కన మంచి మంచి సినిమాలు చేసింది. నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, ఇలా వీరి సరసన హిట్ సినిమాలు చేసి మెప్పించింది విజయశాంతి. ఇక కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు ని కూడా తెచ్చిపెట్టాయి అనేది వాస్తవం. 

 

ఆ సినిమాల ద్వారా ఆమె హీరోయిన్లు కూడా యాక్షన్ సినిమాలు చేయవచ్చు నటన ఉంటే అని నిరూపించారు విజయశాంతి. ఎలాంటి పాత్ర అయినా సరే విజయశాంతి జీవించారు. అంత వరకు బాగానే ఉన్నా దాదాపు 13 ఏళ్ళ తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా మేకప్ వేసుకున్న విజయశాంతి... ఆ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆ సినిమాలో ఆమెకు పారితోషకం ఎక్కువగా ఉండటంతో నిర్మాతలు భయపడ్డారు. పాత్రలో ఆమె జీవించినా సరే హీరోయిన్ కంటే ఎక్కువ పారితోషకం ఇవ్వాలి అని భయపడిన సందర్భాలు ఉన్నాయి. 

 

దీనితో ఆమె ఇప్పుడు సినిమాలకు మళ్ళీ దూరమయ్యారు. ఇటీవల సినిమాలకు దూరం అవుతున్నా అన్నట్టే ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేసారు. మంచి నటిగా గుర్తింపు ఉన్న ఆమె రీ ఎంట్రీ ద్వారా ఆకట్టుకున్నా సరే పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ వెనక్కు తగ్గారు. పారితోషకం ఎక్కువగా ఉండటమే దానికి కారణం అయింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు విజయశాంతి బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని... పారితోషకం విషయంలో ఆమె భయపెట్టడం తో అటు హీరోలు కూడా భయపడ్డారట.

మరింత సమాచారం తెలుసుకోండి: