‘భీష్మ’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో వరసగా రెండు హిట్స్ అందుకున్న దర్శకుల లిస్టులో వెంకీ కుడుముల కూడా చేరిపోయి చాల మందికి షాక్ ఇచ్చాడు. దీనితో ప్రస్తుతం చాలామంది హీరోలు ఈ దర్శకుడి వైపు చూస్తున్నారు. 


ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థగా పేరు గాంచిన యువి క్రియేషన్స్ నిర్మాతలకు వెంకీ లేటెస్ట్ గా వినిపించిన ఒక లైన్ ఆ నిర్మాతలకు మాత్రమే కాకుండా ప్రభాస్ కు కూడ బాగా నచ్చింది అన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆ లైన్ కు సంబంధించి ఒక పూర్తి స్క్రిప్ట్ ను తయారు చేసే పనిలో వెంకీ కుడుముల టీమ్ ఉన్నట్లు టాక్. 


నాగ శౌర్యకి ‘ఛలో’ నితిన్ ‘భీష్మ’ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఈ డైరెక్టర్ ఇప్పుడు ప్రభాస్ తో ఏకంగా ఒక పాన్ ఇండియా మూవీ డైరెక్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.  ప్రభాస్ కి ఉన్న మార్కెట్ రీత్యా అన్ని భాషల ప్రేక్షకులకు సరిపడే కథ వెంకీ కుడుమల క్రియేట్ చేసాడు అని అంటున్నారు. 


అయితే ఇప్పుడు ఈ ప్రయత్నాలు దర్శకుడు సందీప్ వంగా కు అడ్డుగా మారాయి అని కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి బాలీవుడ్ లో కబీర్  సింగ్ ఘన విజయం తరువాత సందీప్ వంగా దృష్టి ప్రభాస్ పై పడింది. అతడితో ఒక పాన్ ఇండియా మూవీ చేయాలని చాల గట్టి ప్రయత్నాలు చేస్తూ ఇప్పటికే ఒక కథను కూడ చెప్పాడు. అయితే ‘సాహో’ పరాజయంతో షాక్ అయిన ప్రభాస్ సందీప్ వంగా తో సాహసం చేయలేక పోతున్నాడు. ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉన్న ప్రభాస్ ను ఇప్పుడు వెంకీ కుడుమల బుట్టలో పదేసుకున్నాడు అని వస్తున్న వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: