మళయాల సినిమా ప్రేమమ్ తో  సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన భామ సాయిపల్లవి తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ ని అందుకుంది. మొదటి సినిమా ఫిదాతోనే ఎక్కడలేని పేరుని సంపాదించుకున్న సాయిపల్లవి ఆ తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి.  కానీ ఏది పడితే అది చేయకుండా తాను చేసే సినిమాలని చాలా జాగ్రత్తగా ఎంచుకుంటుంది.

 

 

 

ఫిదా తర్వాత ఆమె పడి పడిలేచే మనసు. ఎమ్ సీ ఏ లాంటి సినిమాల్లో కనిపించింది.  ఫిదా సినిమా సక్సెస్ లో ఎక్కువ భాగం సాయిపల్లవికే చెందుతుందన్నది వాస్తవం.సక్సెస్ లో ఎక్కువ భాగం తమకే వచ్చిన హీరోయిన్లు వస్తున్న ఆఫర్లని ఒప్పేసుకుంటూ స్టార్ హీరోల సరసన నటించడానికి రెడీ అయిపోతారు. తద్వారా స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంటారు. కానీ సాయిపల్లవి ఈ పద్దతికి తాను దూరం అని చెప్తోంది.

 

 

 

 

ఏది పడితే అది చేసేసి స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలని తనకు లేదని చెప్తుంది. స్టార్స్ తో చేసే సినిమాల్లో కథకి క్యారెక్టర్ కి సంబంధం ఉండదని, అలాంటి సినిమాల్లో తాను చేయలేనని చెప్తుంది.కథా పరంగా తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉన్న చిత్రాలలోనే తాను నటిస్తానని, స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం తాను వెంపర్లాడట్లేదని, అలాంటి పాత్రలు చేస్తూ స్టార్ హీరోయిన్ అని అనిపించుకోవాలని లేదని చెప్పింది.

 

 

 

 

సాయిపల్లవి ప్రస్తుతం నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాని వేసవిలో  విడుదల చేస్తారట. ఇంకా రానా దగ్గుబాటి హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా విరాటపర్వంలోనూ నటిస్తుంది. ఈ రెండు చిత్రాల్లోనూ ఆమె తెలంగాణ ప్రాంత అమ్మాయిగా నటిస్తుండడం విశేషం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: