క‌మ‌ల్‌హాస‌న్ సినిమా అంటే ఒక‌ప్పుడు హీరోయిన్ల‌తో ఖ‌చ్చితంగా లిప్‌లాక్ ఉండాల్సిందే. స‌రిత ద‌గ్గ‌రి నుంచి రాణీముఖ‌ర్జీ వ‌ర‌కు క‌మ‌ల్ ముద్దు పెట్ట‌ని హీరోయిన్ లేదు. ఇప్పుడు అదే ఆయ‌న‌ను చిక్కుల్లో ప‌డేస్తోంది. అదేంటి అస‌లు ఏమ‌యింది అనుకుంటున్నారా... 1986లో వ‌చ్చిన త‌మిళ చిత్రం `పున్న‌గై మ‌న్న‌న్‌`. కె. బాల‌చంద‌ర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో క‌మ‌ల్‌హాస‌న్‌, రేవ‌తి, రేఖ హీరో హీరోయిన్‌లుగా న‌టించారు. ఈ చిత్రంలోని ఓ స‌న్నివేశంలో వాట‌ర్ ఫాల్స్ నుండి దూకి క‌మ‌ల్‌, రేఖ ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుంటారు.

 

అయితే ఆ స‌న్నివేశంలో త‌న అనుమ‌తి లేకుండానే త‌న‌ని క‌మ‌ల్ హాస‌న్‌ కిస్ చేయ‌డం షాక్‌కు గురిచేసింద‌ని న‌టి రేఖ ఇన్నేళ్ల త‌రువాత ఆ సంఘ‌ట‌న‌ని గుర్తు చేయ‌డం సోష‌ల్ మీడియా అంతా సంచ‌ల‌నం రేపుతోంది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా క‌మ‌ల్ పై రేఖ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డంతో అవి ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. త‌న‌కు ముందు ఈ స‌న్నివేశంలో ముద్దు సీన్ వుంద‌ని ద‌ర్శ‌కుడు కె. బాల‌చంద‌ర్ కానీ క‌మ‌ల్‌హాస‌న్ కానీ చెప్ప‌లేద‌ని, ఈ సీన్ త‌రువాత ద‌ర్శ‌కుడిని వెళ్లి అడిగితే అందులో త‌ప్పే ముంద‌ని క‌వ‌ర్ చేసుకున్నార‌ని, ఈ ముద్దు సీన్ కొన్ని నెల‌ల పాటు మ‌నో వేద‌న‌కు గురి చేసింద‌ని రేఖ వెల్ల‌డించ‌డం కొత్త వివాదానికి తెర‌లేపింది.

 

ఇక ఇదిలా ఉంటే దీని పై మ‌రోప‌క్క మీటూ వాదులు ఎలా స్పందిస్తారోన‌ని, అస‌లే `ఇండియ‌న్ 2` సెట్ ప్ర‌మాదం కార‌ణంగా విమర్శ‌లు ఎదుర్కొంటున్న క‌మ‌ల్‌కు తాజా వివాదం మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేసేలా వుంద‌ని చెన్నై సినీ వ‌ర్గాలు అంటున్నాయి. అలాగే క‌మ‌ల్ హీరోయిన్ల ప‌ట్ల కాస్త ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న‌లే ప్ర‌వ‌ర్తించేవార‌ని అప్ప‌ట్లో వార్త‌లు కూడా వ‌చ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: