ప‌వ‌న్ రెండేళ్ళ గ్యాప్‌తో వ‌స్తున్న‌ప్ప‌టికీ మంచి గ‌ట్టి పోటీగా రీఎంట్రీ ఇస్తున్నాడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. పింక్ రీమేక్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి వ‌ర‌సు చిత్రాల‌తో దూసుకుపోతున్నాడ‌నే చెప్పాలి. దీంతో క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు. అంతే కాక ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడికి కూడా ప‌వ‌న్ పచ్చ‌జండా ఊపిన‌ట్లు స‌మాచారం. ప్రస్తుతానికి అటు రాష్ట్ర రాజకీయాలతో, మరొక వైపు సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకి సంతకాలు పెడుతూ వెళ్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మరొక తాజా వార్త సామాజిక మాంద్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ తనకు గతంలో హిట్ ఇచ్చిన దర్శకుడితో మ‌ళ్ళీ ఇప్పుడు  సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట.

 


కాగా గతంలో బద్రి చిత్రంతో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పవన్ కళ్యాణ్ ఒక చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నారని తాజా సమాచారం. మ‌రి ప‌వ‌న్ ఇలా గ్యాప్ లేకుండా సినిమాలు చేయ‌డానికి అస‌లు కార‌ణం ఏంటోగాని మెగా ఫ్యాన్స్‌కి మాత్రం పండ‌గే పండ‌గ అని చెప్పాలి. కాక‌పోతే ప‌వ‌న్ ఎంచుకునే క‌థ‌ల్లో ఒక‌దానికి ఒక‌టి పొంతన లేకుండా ఉంటే చాలా బెట‌ర్‌.  అయితే పూరి జగన్నాథ్ వర్కింగ్ స్టయిల్ నచ్చిన అందరు కూడా తనతో సినిమా చేయడానికి వెనకాడరు. అలాంటిది తాజాగా పూరి జగన్నాథ్ చెప్పిన ఒక కథ కి పవన్ కళ్యాణ్ పచ్చ జెండా ఉపారని, ఈ చిత్రానికి సంబందించిన వివరాలన్నీ కూడా త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తారని సమాచారం.

 

 ఇకపోతే ఇప్పటికే వీరి కలయికలో వచ్చినటువంటి బద్రి, కెమెరామన్ గంగతో రాంబాబు చిత్రాలు ఎంతటి ఘనవిజయాన్ని దక్కించుకుందో మనందరికీ తెలిసిందే. అయితే వీరి కలయికలో రాబోతున్న మూడవ చిత్రం ఎలా ఉంటుందో అని ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అలాగే ప‌వ‌న్  ఒక వ‌చ్చే ఏడాది ఫుల్ సినిమాలే సినిమాల‌న్న మాట‌. ఈ స‌మ్మ‌ర్ నుంచే మ‌రి ఆ పండ‌గ స్టార్ట్ అవ్వ‌బోతుంది. అలాగే ప‌వ‌న్ సినిమాలు హిట్‌, ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వ‌చ్చేస్తాయి. ప‌వ‌న్ క్రేజ్ అలా ఉంట‌ది. అందుకే నిర్మాత‌లు ప‌వ‌న్ తో సినిమా తీయ‌డానికి క్యూ క‌డుతుంటారు. అయితే ఈ సినిమా  టైటిల్ బ‌ద్రి 2  అని స‌మాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: