భీష్మ డైరెక్ట‌ర్ వెంకీ కుడుమ‌ల ఛలో సినిమాతో మంచి హిట్ కొట్టిన‌ప్ప‌టికీ... హీరో నాగ‌శౌర్య ఇటీవ‌లె కొంచం కాంట్ర‌వ‌ర్సీ చేసి ఆ క‌థ త‌న‌దంటూ చెప్ప‌డం కాస్త వివాదాస్ప‌దంగా మారిన విష‌యం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే నితిన్‌తో తీసిన భీష్మ చిత్రం కంటే ముందు వెంకీ  రాంచ‌ర‌ణ్‌ని క‌లిసి ఓ క‌థ వినిపించిన‌ట్లు స‌మాచారం. అయితే రాంచ‌ర‌ణ్ ఆర్‌.ఆర్‌.ఆర్‌. మ‌ళ్ళీ కొర‌టాల సినిమాతో బిజీగా ఉండ‌డంతో మ‌ళ్ళీ చెపుతానంటూ చెప్ప‌డంతో... ఆయ‌న ఈ లోపు నితిన్ క‌థ‌ని ఓకే చేసి సెట్స్ మీద‌కు వెళ్ళ‌డం ఆ సినిమా విడుద‌లై మంచి హిట్ కొట్ట‌డం అన్నీ చ‌క చ‌కా జ‌రిగిపోయాయి. ఇక ఈ సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో రాంచ‌ర‌ణ్ వెంకీని పిలిపించిన‌ట్లు స‌మాచారం.

 

వెంకీని పిలిపించి త‌ను చెప్పిన క‌థ ఓకే చేసి పూర్తి బౌండ్ స్క్రిప్ట్ తో ర‌మ్మ‌న్నార‌ట‌. మ‌రి వెంకీ ఇక లైన్‌లో ప‌డిన‌ట్లే ఒకేసారి మెగా ఆఫ‌ర్ అంటే మ‌రి మాములు విష‌యం కాదుక‌దా. ఇక రాంచ‌ర‌ణ్ రాజ‌మౌళి  చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, మరొక యంగ్ హీరో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించనున్నారని మనకు తెలిసిందే. కాగా రామ్ చరణ్ ఒక వైపు హీరో గా నటిస్తూనే, మరొక వైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. ఆ తరువాత చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రంలో కూడా ఒక పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే రాంచ‌ర‌ణ్ బిజీగా ఉండ‌డం వ‌ల్ల మ‌హేష్ చేస్తార‌ని ఆ పాత్ర అన్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఇంకా ఏ విష‌యం అధికార ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. 

 

ఇకపోతే ఈ రెండు చిత్రాల తరువాత రామ్ చరణ్ వెంకీకుడుమ‌ల‌తో సినిమా చేయడానికి ఒప్పుకున్నారని సమాచారం. వరుస విజయవంతమైన చిత్రాలతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్నటువంటి దర్శకుడు వెంకీకుడుమ‌ల‌. రాంచ‌ర‌ణ్‌ని ఏ విధంగా చూపించ‌బోతున్నారు అస‌లు క‌థ క‌థ‌నాలు ఏమిట‌న్న‌ది ఇంకా తెలియాల్సి ఉంది.  ఈ తరుణంలో వెంకీ, రామ్ చరణ్ ని కలుసుకొని ఒక ప్రత్యేకమైన స్టోరీ లైన్ వినిపించినట్లు, ఆ కథకి రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అయితే ఈ చిత్ర గురించి ఇంకా అధికారిక  ప్ర‌క‌ట‌న రావ‌ల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: