నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నాగార్జున తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత నాగార్జున నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ  ఇచ్చిన అఖిల్ నాగచైతన్య లో... ఇండస్ట్రీలో కాస్తోకూస్తో నిలదొక్కుకున్నది  నాగచైతన్య అనే చెప్పాలి. మంచి విజయాలు అందుకుంటూనే... వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు నాగచైతన్య. అక్కినేని వారసుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అక్కినేని కుటుంబం తాతల కాలం నుంచి కేవలం నటనలోనే కాదు సినిమాల నిర్మాణంలో కూడా విజయవంతంగా అడుగులు వేసిన విషయం తెలిసిందే. 

 

 

 ఈ క్రమంలోనే అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి ఎన్నో చిత్రాలను నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్  తెలుగు ప్రేక్షకుల్లో గుండెల్లో  మంచి స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పటికీ అన్నపూర్ణ స్టూడియోస్ కి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత అక్కినేని నాగార్జున... నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. సొంతంగా మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్ ను కూడా ఏర్పాటు చేశారు అక్కినేని నాగార్జున. నాగార్జున స్థాపించిన మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్ ద్వారా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం కూడా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. 

 

 

 తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి అక్కినేని వారసుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో నాగచైతన్య. ఇప్పటికే అక్కినేని వారసుడిగా  అక్కినేని అభిమానులు అందరినీ సంతృప్తి పరుస్తూన్నాడు. కాగా  నాగచైతన్య కొన్ని రోజుల్లో నిర్మాణ రంగంలోకి  అడుగు పెట్టబోతున్నాడని టాక్ కూడా వినిపిస్తోంది. అక్కినేని నాగచైతన్య సొంత బ్యానర్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త టాలెంట్ ను కొత్త కాన్సెప్టు చిత్రాలను ఎంకరేజ్ చేసే విధంగా... సినిమాలు నిర్మించాలనే ఉద్దేశంతో అక్కినేని నాగ చైతన్య సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక తన బ్యానర్లో యువ హీరో రాజ్ తరుణ్ తో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ఇప్పటికే రెడీ అయ్యాడట నాగ చైతన్య. అయితే ఈ వార్తలపై అక్కినేని కుటుంబం  నుంచి  అధికారిక ప్రకటన  రావాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: