ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్ హీరోలు హీరోయిన్లు సినిమాల్లో, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో సంపాదించేది కాకుండా కొత్త కొత్త వ్యాపార రంగాల్లోకి అడుగుపెడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే వాటిలో ఎక్కువ‌గా రెస్టారెంట్లు, ఎడ్యుకేష‌న్‌కి సంబంధించిన‌వి అధికంగా ఉంటున్నాయి. అయితే ఇదిలా ఉంటే... ఇటీవ‌లె అక్కినేని కోడ‌లు స‌మంత స్కూల్ బిజినెస్‌ని స్టార్ట్ చేసింది. ఎకాంమ్ లెర్నింగ్ సెంట‌ఱ్ పేరుతో హై క్లాస్ ప్లే స్కూల్ ని ప్రారంభించారు. డిజైనర్ శిల్పారెడ్డి భాగస్వామ్యంలో సామ్ ప్రారంభించిన ఈ ప్లే స్కూల్ కి సెలబ్రిటీ ప్రపంచం నుంచి అద్భుతమైన  స్పందన రావ‌డం ఇక్క‌డ విశేషంగా మారింది.

 

అయితే ఈ స్కూల్ ఈ నెల ఫిబ్ర‌వ‌రి 22న లెర్నింగ్ సెంటర్ టాప్ సెలబ్రిటీల మధ్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం లో అంద‌రిని ఆక‌ట్టుకున్న విష‌యం ఏమిటంటే... మెగాస్టార్ చిరంజీవి మనవరాలు.. శ్రీజ కుమార్తె నవిష్క జగన్ సందడి హైలైట్ గా నిలిచింది. ఆ ఫొటోలు తాజాగా సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్యూట్ బేబి నవిష్క ఏకామ్‌ సెంటర్ లో ఆడుకుంటున్న ఫొటోలు ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

 

ఇక సెల‌బ్రెటీలు ఏమి చేసినా వింతే క‌దా. ఆ విష‌యం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాగే మెగాస్టార్ మనవరాలు క్యూట్ లుక్ పై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సమంత స్కూల్ కి మెగా మనవరాలు బ్రాండ్ అంబాసిడరా? అంటూ తెగ పొగిడేస్తూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మెగా ఫ్యాన్స్. అప్పటి ప్రారంభోత్సవంలో శ్రీజ మాట్లాడుతూ.. `ఏకామ్‌` స్కూల్ తనకు ఎంతో బాగా న‌చ్చింద‌ని హృదయాన్ని హత్తుకుందని.. సమయం దొరికినప్పుడల్లా తన కుమార్తెను ఇక్కడికి తీసుకువస్తానని శ్రీజా చెప్పారు. ఈ కార్యక్రమంలో సమంత- శిల్పారెడ్డి సహా పలువురు టాప్ సెలబ్రిటీలు సందడి చేశారు. మ‌రి ఈ స్కూల్ బిజినెస్ స‌మంత‌కి ఎంత పెద్ద స‌క్సెస్‌ని ఇస్తుందో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: