బుల్లి తెరపై హాట్ యాంకర్గా గుర్తింపు దక్కించుకున్న అనసూయ ఇక వెండి తెరపై కూడా తన అదృష్టాన్నీ పరీక్షించుకుంటోంది. వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగాను.. అటు క్షణం సినిమాలో కీలక పాత్రలోనూ నటించడంతో పాటు సాయి ధరమ్ తేజ్ విన్నర్ సినిమాలో ఏకంగా స్పెషల్ సాంగ్లో కూడా ఆడి పాడింది. బుల్లి తెర మీదే కాకుండా వెండి తెర మీద సైతం అనసూయ దూసుకు పోతుండడంతో ఆమె అభిమానుల ఆనందానికి అవధులే లేవు. ఇప్పటికే పెళ్లయ్యి ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయ హాట్ హాట్ గా కనిపించడమే ఓ సంచలనం అంటే ఇప్పుడు ఏకంగా మైండ్ బ్లాక్ అయ్యే డెసిషన్ తీసుకుంది.
భారీ అంచనాలున్న సినిమాల్లో ఈమెను కీలక పాత్రల కోసం తీసుకుంటున్నారు. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రను చేసిన తర్వాత అనసూయకు మంచి పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ చేసిన క్యారెక్టర్ ఆమె కెరీర్లోనే ఓ మై లు రాయిగా మిగిలి పోయింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అంధాదున్ రీమేక్లో నటించే అవకాశం ఆమెకు దక్కింది.
అంధాదున్ చిత్రంలో టబు కీలక పాత్రలో నటించింది. టబు పోషించిన పాత్ర కాస్త బోల్డ్గా ఉంటుంది. అటు అందాల ప్రదర్శన చేయడంతో పాటు సినిమాలో ఆ పాత్రకు చాలా బోల్డ్ డైలాగులు ఉంటాయి. ఇప్పుడు ఆ పాత్ర కోసం తెలుగులో ఎవరిని తీసుకోవాలా ? అని పెద్ద ఎత్తున తర్జన భర్జనలు నడిచాయి. చివరకు అనసూయ ఆ పాత్ర చేసేందుకు ఓకే చెప్పడంతో ఈ హాట్ యాంకర్ ఇప్పుడు బోల్డ్ క్యారెక్టర్లో ఎలా చేస్తుందా ? అని అందరూ ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.
అంధుధాన్ రీమేక్ను మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమాను నితిన్ తండ్రి రీమేక్ చేస్తున్నాడు. బుల్లితెరపై హాట్ యాంకర్ గా కుర్రకారు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న అనసూయ ఇప్పుడు ఈ బోల్డ్ క్యారెక్టర్లో ఇంకెంత రచ్చ చేస్తుందో ? చూడాలి.