సాయిపల్లివి ఈ పేరు వింటే చాలు తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్. ఫిదా చిత్రంతో ఈమె నటనకి ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులంతా. తెలంగాణా స్లాంగ్తో తన డైలాగులతో ప్రేక్షకులను కట్టిపడేసిందంతే. అయితే ఈ భామకి ఎన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ చాలా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటది. ఎప్పుడూ కూడా తొందరపడదు. ఈమె కథల ఎంపిక కూడా చాలా బావుంటాయి. అలాగే ఈ భామ మంచి డ్యానర్ కూడా. ప్రస్తుతం ఈమె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈమె నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.
మరి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలిన అన్ని భాషల్లో విడుదల కసం దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ భామ ఇటీవలె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను కెరీర్ లో ఎన్ని సినిమాలు చేశాను అని కాకుండా మంచి సినిమాలు చేశాను అని చెప్పుకోవాలనుకుంటున్నాను అని అంది. అందుకే ఏ సినిమాకు పడితే ఆ సినిమాకు ఓకే చెప్పడం లేదు. కథకు పాత్రకు సంబంధం లేని పాత్రలు కొన్ని నా వద్దకు వస్తున్నాయి. అలాంటి పాత్రలు.. అలాంటి సినిమాలు నేను అస్సలు చేయాలనుకోవడం లేదు అంటూ సాయి పల్లవి దర్శకులకి ముందుగానే ఓ క్లారిటీ ఇచ్చింది.
కథలో కీలకమైన పాత్ర ఉంటేనే తనను సంప్రదించాలంటూ సాయి పల్లవి ఫిల్మ్ మేకర్స్ ను రిక్వెస్ట్ చేస్తుంది. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ కు స్కోప్ తక్కువ ఉంటుంది. ఎలాంటి పాత్రలను అయినా చేయాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు మాత్రమే స్టార్ హీరోయిన్ గా నిలుస్తారు. కాని సాయిపల్లవి ఇందుకు విరుద్ధంగా నాకు స్టార్ కథానాయికగా పేరు అక్కర్లేదు. మంచి పాత్రలు చేస్తానన్న పేరు ఉంటే చాలు అని అంటుంది. ఇక ఈ భామ ఎక్స్పోజ్ చెయ్యనప్పటికీ చాలా మంది ఈమె అందానికి ఫిదా అయిపోయారంటే అతిశయోక్తి కాదు.