సూర్య హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సింగం 3 సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఉత్తరాది నటుడు థాకూర్ అనూప్ సింగ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అనూప్ తరువాత సుప్రీం హీరోగా సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విన్నర్ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. తరువాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన రోగ్ సినిమాతో విలక్షణ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు.
బాడీ బిల్డింగ్లో ఎన్నో మెడల్స్ అందుకున్న అనూప్.. నటుడిగా, అత్లెట్గా, పైలెట్గా, గాయకుడిగా ఇలా వివిధ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఈ యువ నటుడు మహాభారత్ సీరియల్లో ధృతరాష్ట్రుడి పాత్రతో నటుడిగా మారాడు. నార్త్లో 2011 నుంచి టీవీ సీరియల్స్లో నటిస్తున్న అనూప్ 2017లో సౌత్ సినిమాలతో వెండితెర అరంగేట్రం చేశాడు. ఎక్కువగా విలన్ పాత్రలోనే నటించిన ఉద్ఘర్ష అనే సినిమాతో హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
అయితే రెగ్యులర్గా తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండే అనూప్ థాకూర్ సింగ్ తాజాగా ఓ పోస్ట్ చేశాడు. తన ఫ్యాంట్ ను కిందకు అని అక్కడ సెల్ఫోన్ పెట్టుకొని సెల్ఫీ తీసుకుంటు దిగిన ఫోటోను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేశాడు. అయితే ఆ ఫోటోతో పాటు హ్యాండ్స్ ఫ్రీ సెల్ఫీ అంటూ కామెంట్ చేశాడు. ఈ ఫోటోపై నెటిజెన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. కొంతమంది అనూప్ క్రియేటివిటీ భేష్ అంటుంటే.. మరికొందరు మాత్రం ఇందే పైత్యం అంటూ పెదవి విరుస్తున్నారు.