శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమాలో రానా సరసన హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రిచా గంగోపాధ్యాయ్.. ఆ తరువాత రవి తేజతో మిరపకాయ్, సారొచ్చారు, ప్రభాస్ తో మిర్చి, వెంకటేష్ తో నాగవల్లి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. చేసింది కొన్ని సినిమాలు అయినప్పటికీ స్టార్ హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.
మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కు వచ్చిన ఈ భామ కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఎందుకు ఈ షాక్ ఇచ్చింది అని అనుకోగా పైచదువులకోసం విదేశాలకు వెళ్లిపోయింది. అలాంటి ఈ స్టార్ హీరోయిన్ తెలుగు సినిమాల్లో అలా మెరిసి ఇలా వెళ్లిపోయింది.
ఇక పోతే.. అలా గుడ్ బై చెప్పిన రిచా గంగోపాధ్యాయ్ రెండు సంవత్సరాల క్రితం చదువు పూర్తి చేసుకుంది. చదువు పూర్తి అయినా వెంటనే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది అని అందరూ ఊహించారు.. కానీ ఆమె ఆలా చెయ్యలేదు.. ఆమె చదువు తగ్గట్టుగానే బిజినెస్ చేసుకుంటూ ఇండిపెండెంట్ మహిళా జీవితాన్ని గడుపుతుంది.
అయితే గత సంవత్సరం ఆమె బిజినెస్ స్కూల్లో పరిచయం అయిన జోయ్ అనే అతనితో తనకు నిశ్చితార్థం జరిగినట్టుగా రిచా గంగోపాధ్యా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అయితే గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఆమె పెళ్లి చేసుకొని ఓ మంచి జీవితాన్ని గడుపుతుంది. నటన పరంగా వచ్చి.. ఒక స్టార్ లా ఎదిగి ఆ తర్వాత చదువు కోసం సినిమాను వదిలేసినా నటి రిచా గంగోపాధ్యాయ్!
Thanks everyone for the kind wishes 🤗🥰. Married a little over 3 months to the love of my life and couldn't (cont) https://t.co/N7kZJvSf8h
— Richa Langella (Gangopadhyay) (@richyricha) December 19, 2019