టాలీవుడ్ ఫిదా సినిమా హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి మొదట మాలీవుడ్లో ప్రేమం సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఎంతో బాగా ఆకట్టుకుంది.  వాస్తవానికి సాయి పల్లవి తెలుగు బుల్లితెర పై డాన్స్ ప్రోగ్రాం లో పాల్గొని మీ అందరితో శభాష్ అనిపించుకుంది. డాక్టర్ కావాలనుకున్న సాయి పల్లవి అనుకోకుండా హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది. సాయి పల్లవి మొదటి నుంచి ఎంతో నేచురల్ గా నటించడం చూస్తూనే ఉన్నాం. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాలో వరుణ్ తేజ దాదాపు చేసినట్టే నటించింది. ఈ మూవీలో దశలో వరుణ్ తేజ కన్నా ఎక్కువ పేరు వచ్చింది. అచ్చ తెలంగాణ యాసలో మాట్లాడుతూ భానుమతి  హైబ్రిడ్ పిల్ల ఒక్కటే పీస్.. అంటూ సాయిపల్లవి డైలాగ్స్ అప్పట్లో యూత్ని ఉర్రూతలూగించాయి.

 

సాయిపల్లవి తెలుగు తమిళం మలయాళం భాషల్లో హీరోయిన్గా నటిస్తుంది. సాధారణంగా ఎవరికైనా యాడ్స్ లో నటించే అవకాశం వస్తే ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. చాలా మంది హీరోయిన్లు దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకుంటున్న ఏర్పాటు చేసుకుంటున్నారు.ముఖ్యంగా సినిమా హీరోయిన్ గా ఉన్నప్పుడు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ ఏమైనా యాడ్స్ వస్తే అందులో నటిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ఒక యాడ్ లో సాయి పల్లవి కి ఛాన్స్ వచ్చినా దాదాపు 2 కోట్ల ఆఫర్ వచ్చినా సున్నితంగా తిరస్కరించింది. తాను మోసం చేస్తూ సంపాదించే అవసరం లేదని యాడ్స్ రూపంలో తాను ఎవరినీ మోసం చేయను అని ఖరాఖండిగా చెప్పేసిందట.

 

దాంతో సహనటి ముందు మరింత దూకుడు అవసరమని ఆమె ను విమర్శించిన వాటిని ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి రానా జంటగా నటిస్తున్న విరాటపర్వం షూటింగ్ పూర్తి కావచ్చింది. త్వరలో మీ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మూవీ లో సాయి పల్లవి నటనకు మరోసారి ఫిదా కావాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: