ప్యాన్ ఇండియా మూవీ రేంజ్లో ఉన్న హీరో ప్రభాస్. ప్రస్తుతం ఆయన ఏ సినిమా తీసిన ప్రపంచ వ్యాప్తంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దర్శకధీరుడు రాజమౌళి ప్రభాస్ రేంజ్ని పెంచేశారనే చెప్పాలి. మరీ ఇటీవలె విడుదలైన ప్రభాస్ చిత్రం సాహో కూడా ఊహించిన రేంజ్లో హిట్ కాలేకపోయిన విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ప్రభాస్ నెక్స్ట్ మూవీ గురించి ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ ఈ లోపే తన ఫ్యాన్స్కి పెద్ద షాక్ ఇచ్చాడు అదేంటంటే...
వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ కుమార్తులు ఇప్పుడు సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య వచ్చిన అశ్వనీదత్ అల్లుడు నాగఅశ్వన్ మహానటి సావిత్రి జీవిత గాధ తెరకెక్కించి అద్భుత విజయాన్ని సాధించారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నాగశ్విన్ ఇప్పుడు ప్రభాస్తో సినిమా చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో ఒక్కసారిగా ఇటు ప్రభాస్ ఫ్యాన్స్, అటు నాగ అశ్విన్ ఫ్యాన్స్కి ఇది అశ్చర్యకరమైన వార్త అనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ జిల్ డైరెక్టర్ రాధాకృష్ణతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఆ చిత్రం అవ్వగానే ప్రభాస్ నాగ అశ్విన్ సినిమాలో చేయబోతున్నట్లు ఎవ్వరికీ తెలియని షాక్. సడెన్గా బుధవారం ఈ వార్తను ఊహించని విధంగా చిత్ర యూనిట్ సమాచారాన్ని అందించింది. మరి ఈ ఎనౌన్స్మెంట్తో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇక పండగనే చెప్పాలి.
ఇక మహానటి చిత్రం తర్వాత నాగశ్విన్ ఏంటి ఇంత సైలెంట్ అయిపోయాడు అని అనుకుంటుంటే... సడెన్ షాక్ని ఇచ్చి అందర్నీ అవాక్ అయ్యేలా చేశాడు. మరి వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈచిత్రం కథ, కథనాలు ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. మరి అంత గొప్ప సినిమాని తీసిన అశ్విన్ ప్రభాస్ని ఏ విధంగా చూపిస్తాడా అని ఓ పక్క ఫ్యాన్స్లో అప్పుడే టెన్షన్ కూడా మొదలయింది. మరి ఈ సమాచారానికి సంబంధించి ఓ పోస్టర్ కూడా విడుదలయింది.