సూపర్‌స్టార్ మ‌హేష్‌బాబుని డైరెక్ట‌ర్ చేయాల‌ని టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రి ఆశ‌. అయితే అలా అవ‌కాశం దొర‌క‌డ‌మే చాలా క‌ష్టంగా ఫీల‌వుతారు. అలాగే మ‌హేష్‌కి డైరెక్ట‌ర్స్ హీరో అన్న పేరు కూడా ఉంది. ద‌ర్శ‌కులు ఎలా చెపితే అలా ఫాలో అవ్వ‌డ‌మే మ‌హేష్ చేసే ప‌ని. ఎప్పుడూ కూడా ఎంత అనుభ‌వం ఉన్నా ఈ రోజు వ‌ర‌కు క‌థ‌లో వేలు పెట్ట‌డం లాంటివి చెయ్య‌డు. 

 

అయితే ఈ మ‌ధ్య మాత్రం కొంద‌రు ద‌ర్శ‌కులు మ‌హేష్‌కి దూర‌మ‌వుతున్నారు. కార‌ణం ఏమిటంటే... పూరి జగన్నాధ్ చాలా కాలం మహేష్ తో 'జనగణమన' చేయాలని ప్రయత్నించినా పూరి ఫాం లో లేకపోవడంతో అవకాశం ఇవ్వలేదనే టాక్ వినిపిస్తోంది. 'పోకిరి' లాంటి ఇండస్ట్రీ హిట్.. 'బిజినెస్ మేన్'  లాంటి మరో హిట్ ఇచ్చిన పూరిని మ‌హేస్‌ తర్వాత కాలంలో పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ట‌. 

 

ఇక త్రివిక్ర‌మ్‌తో మ‌హేష్ రెండు సినిమాలు చేశాడు. మొద‌ట‌ల్లో ఇద్ద‌రూ చాలా బాగా ఉండేవారు. అయితే రాను రాను ఏమ‌యిందో తెలియ‌దు కానీ ఇద్ద‌రూ దూర‌మ‌య్యారు. ఇక సుకుమార్ ఇష్యూ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్రాజ‌క్ట్ ఇంక స్టార్ట్ అవ్వ‌డం ఒక్క‌టేలేటు అనుకునే టైంకి క్యాన్సిల్ అయిపోయింది. ఆ టైంలో గ‌త్యంత‌రం లేక సుకుమార్ మ‌ళ్ళీ వేరే ప్రాజెక్ట్‌కి వెళ్ళిపోయాడు. 

 

ఇక ఇప్పుడు వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సిల్ అని వార్త రావడంతో  వంశీ కూడా దూరమైనట్టేనని అంటున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' సమయం లో అనిల్ రావిపూడి తో సన్నిహితంగా ఉన్నప్పటికీ ఆ సినిమా కూడా ఆశించినంత విజయం సాధించకపోవడంతో  మ‌రికాస్త గ్యాప్ అయితే వ‌చ్చింద‌ని గాసిప్ వినిపిస్తోంది. అయితే దీని పై ఆరా తియ్య‌గా దిల్‌రాజు ఈ సినిమా ఆశించినంత క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌లేద‌ని అన్నార‌ట‌.  ఇక ఉన్న దర్శ‌కులంద‌ర్నీ ఇలా వ‌దిలేసుకుంటే మ‌హేష్ ప‌రిస్థితి ఏంటి. పైగా అంద‌రూ స్టార్ డైరెక్ట‌ర్లు.  ఇక మ‌హేష్ కాస్త త‌గ్గితే బెట‌రేమో అన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: