టాలీవుడ్ లో మహేష్ బాబు కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరో ఎవరు అంటే అందరికీ గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మహేష్ బాబు. అయితే గత కొంత కాలం నుంచి బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ పై దృష్టి పెడుతూ టాలీవుడ్లో విలన్లుగా నటిస్తూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు హీరోలు కూడా బాలీవుడ్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో కూడా తమకు క్రేజ్  సంపాదించుకొని అక్కడ కూడా ప్రేక్షకులను అలరించాలని అనుకుంటున్నారు తెలుగు హీరోలు. 

 

 

 ఇప్పటికే ప్రభాస్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... తాజాగా మహేష్ బాబు గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతున్నాడట. అది కూడా మామూలుగా కాదు మల్టీ స్టారర్ సినిమాతో.బాలీవుడ్ లో ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన హీరో రణవీర్ సింగ్. త్వరలో మహేష్ బాబు రనవీర్  సింగ్ తో కలిసి మల్టీస్టారర్ లో హిందీ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని సమాచారం. ప్రస్తుతం మహేష్  ముంబైలో ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్నారు. ఇక ఈ షూటింగ్ ముగియగానే సాజిత్ నడియావాలా నిర్మించే ఓ సినిమాకు ఈ ఇద్దరు స్టార్ హీరోలు సైన్  చేయబోతున్నారని సమాచారం. 

 

 

 అయితే టాలీవుడ్ లో మహేష్ కూ  మోస్ట్ హ్యాండ్సమ్ అని ఎలా పేరుందో బాలీవుడ్ లో  కూడా రన్వీర్ సింగ్ కి అలాగే పేరుంది. మరి ఇద్దరు హ్యాండ్సమ్ లతో కలిసి ఫీచర్ ఫిలిం చేయాలని నిర్మాత సాజిద్ ఎన్నో ఏళ్ల నుంచి ప్లాన్ చేస్తున్నారట. ఇది ఇప్పటికి కుదిరినట్లు సమాచారం. ఒకవేళ వీరిద్దరి కాంబోలో నిజంగానే మల్టీస్టారర్ సినిమా వస్తే మాత్రం అది సెన్సేషన్ కానుంది. ఎందుకంటే ఈ ఇద్దరు హీరోల మనస్తత్వాలు వేరు. మహేష్ బాబు నిదానంగా కూల్ గా ఉంటే.. రన్వీర్ సింగ్ మాత్రం ఎప్పుడూ జోష్ గా  తెగ అల్లరి చేస్తూ ప్లే బాయ్ లాగా ఉంటాడు. మరి ఇద్దరు కలిసి నిజంగానే మల్టీస్టారర్ చేయబోతున్నారా అనేది మాత్రం అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: