కన్నడ నటుడు యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కెజిఎఫ్ చాప్టర్ వన్ సినిమా 2018 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కన్నడలో తెరకెక్కిన ఆ సినిమాని ముందుగా చూసిన టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సినిమాలో కథ, కథనాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని, దీనిని కేవలం కన్నడకు మాత్రమే పరిమితం చేయకుండా పాన్ ఇండియా మూవీగా మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేయమని చెప్పడంతో, యూనిట్ సభ్యులు అలానే చేసారు. అయితే ఆ తరువాత దాదాపుగా సౌత్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా హిందీ వర్షన్ లో రిలీజ్ అయిన ఆ సినిమా, అన్ని భాషల్లో కూడా అత్యద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. 

 

హీరో యాష్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి తో పాటు సినిమాలోని దాదాపుగా అందరూ పాత్రధారులకు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ సినిమాలో హీరో అయిన రాకీ పాత్రను పరిచయం చేసే పాత్రలో అనంత్ నాగ్ సినిమాలో ఒక కీలక పాత్ర్రలో నటించారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చాప్టర్ 2 సినిమాలో కూడా అదే పాత్రలో నటిస్తున్న అనంత నాగ్, ఇటీవల సినిమా నుండి అర్ధాంతరంగా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కన్నడనాట ఎంతో గొప్ప పేరు గల అనంత్ నాగ్, పలు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి మంచి పేరు గడించారు. 

 

అయితే ఇటీవల కెజిఎఫ్ సినిమా యూనిట్ తో వచ్చిన కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆయన సినిమా నుండి తప్పుకున్నారని అంటున్నారు. అలానే ఆయన స్థానంలో మరొక నటుడిని తీసుకునే పనిలో ఉందట సినిమా యూనిట్. అయితే ప్రస్తుతం ఎంతో వైరల్ గా ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తి నిజానిజాలు మాత్రం వెల్లడి కావలసి ఉంది. కాగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమాని ఈ ఏడాది మే నెలాఖరులో రిలీజ్ చేసే అవకాశం కనపడుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: