ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో మలిస్టార్లతో ఎక్కువ సినిమాలు వస్తున్నా సంగతి తెలిసిందే.. అందులో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండగా మరికొన్ని సినిమాలు జనాలను మెప్పించలేక పోయాయి. ఏది ఏమైనా చాలా సినిమాలు ఇప్పుడు పెద్ద స్టార్లతో వస్తున్నాయి.బాహుబలి లాంటి పెద్ద సినిమాలు కూడా మల్టీస్టారల్తో  వచ్చి భారీ ఘన విజయాన్ని అందుకుంటూ వస్తున్నాయి. 

 

 


అయితే ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ హీరోలతో మరో సినిమా రానుంది. మహేశ్ బాబు అభిమానుల్లో జోష్ నింపే వార్త ఇది. టాలీవుడ్ సూపర్ స్టార్‌‌ బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడట. అది కూడా మామూలుగా కాదు. బాలీవుడ్‌లో ఇప్పుడు విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న యంగ్‌ హీరో రణ్‌వీర్‌‌ సింగ్‌తో కలిసి మల్టీస్టారర్‌లో మహేశ్ నటించబోతున్నాడని సమాచారం.

 

 

ఇది ఇలా ఉండగా మహేశ్, రణ్‌వీర్‌‌ ముంబైలో ఓ వాణిజ్య ప్రకటన చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ షూట్‌ ముగిసిన వెంటనే  ప్రముఖ ప్రొడ్యూసర్‌‌ సాజిద్‌ నడియాడ్ వాలా నిర్మించే సినిమాకు సంతకం చేయబోతున్నారని తెలుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోలతో  కలిసి హిందీలో ఓ ఫీచర్ ఫిల్మ్  తీయాలని సాజిద్  ప్లాన్‌ చేస్తున్నాడట. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

ఈ వార్త కనుక నిజమైతే ఒకవేళ మహేశ్, రణ్‌వీర్‌‌ కలిస్తే ఓ క్రేజీ కాంబో కానుంది. ఎందుకంటే ఈ ఇద్దరూ భిన్న మనస్తత్వం కలవారు. మన టాలీవుడ్ సూపర్ స్టార్ చాలా నిదానంగా, రిజర్వ్‌డ్‌గా ఉంటే దానికి పూర్తి భిన్నంగా రణ్‌వీర్‌‌ తెగ అల్లరి చేస్తూ అందరితో ఇట్టే కలిసిపోతాడు. దూకుడు స్టార్ రణవీర్ తో మహేష్ సినిమా అంటే అందరిలో ఇప్పటి నుండే ఒక ఆసక్తి నెలకొంది. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: