లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా భారతీయుడు 2. కొన్నేళ్ల క్రితం వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో అతి పెద్ద సంచలన విజయాన్ని అందుకుంది. మన దేశంలో లంచగొండితనం పెరిగిపోవడంతో, దానిని రూపుమాపడానికి ఒక వృద్ధుడు, కొందరు లంచగొండులను పట్టుకుని శిక్షించడం అనే నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమాకు అప్పటి ప్రజలు నీరాజనాలు అందించారు. అయితే మళ్ళి ఎన్నో ఏళ్ళ విరామం తరువాత ప్రస్తుతం దానికి సీక్వెల్ గా భారతీయుడు 2 తెరకెక్కుతుండడంతో సినీ ప్రేక్షకుల్లో ఆ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, సిద్దార్థ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల శరవేగంగా జరుగుతోంది. 

 

అయితే కొద్దిరోజుల క్రితం హఠాత్తుగా షూటింగ్ లో అమాంతం ఒక పెద్ద క్రేన్ విరిగిపోవడంతో ఒక్కసారిగా పెను ప్రమాదం సంభవించింది. అయితే ఆ దుర్ఘటనలో మొత్తం ముగ్గురు ఆ సినిమా యూనిట్ సభ్యులు చనిపోగా, దర్శకుడు శంకర్ సహా మరికొంతమందికి గాయాలయ్యాయి. ఇక ఆ దుర్ఘటనతో యావత్ భారతీయ సినిమా పరిశ్రమ మొత్తం ఎంతో దిగ్బ్రాంతికి గురైందనే చెప్పాలి. ఇక ఇటీవల మరణించిన వారి కుటుంబాలకు హీరో కమల్ కోటి రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. అయితే ఎట్టకేలకు నేడు తొలిసారిగా ఆ దుర్ఘటనపై నోరు విప్పారు దర్శకుడు శంకర్. తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా కాసేపటి క్రితం ఒక ట్వీట్ చేసిన శంకర్, నిజంగా మొన్న మా సినిమా సెట్లో జరిగిన దుర్ఘటన నేను ఇప్పటికీ మరచిపోలేక పోతున్నాను, నిజానికి నాకు పదే పదే అదే దుర్ఘటన గుర్తుకు వస్తోంది. 

 

ఆ భగవంతుడు, క్రేన్ నా మీద పడేలా చేసి వారి బదులు నన్ను పైకి తీసుకెళ్లిపోవలసింది అంటూ ఆయన ఎంతో ఆవేదనతో సంచలనం గా ఒక ట్వీట్ చేసారు. అయితే శంకర్ ఆవేదన గ్రహించిన పలువురు నెటిజన్లు, సార్ ఆ దుర్ఘటన అనుకోకుండా జరిగింది. కాగా ఆ ఘటనలో మరణించిన వారి పట్ల అందరికీ సానుభూతి ఉంది, దయచేసి మీరు అటువంటి మాటలు అనకండి, మీ వంటి వారు నిండు నూరేళ్ళు బ్రతకాలి అంటూ ఆయనకు ధైర్యం చెపుతూ రీట్వీట్స్ చేస్తున్నారు. కాగా శంకర్ చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: