పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘అజ్ఞాతవాసి’ ఒక పీడ కల. పవన్ కు సినిమాల పై విరక్తి కలిగేలా చేసిన ఈ మూవీలో పవన్ కీర్తి సురేశ్ ల క్రేజీ కాంబినేషన్ ఉన్నా కనీసం పవన్ అభిమానులు కూడ ఆ సినిమాను భరించ లేకపోయారు. ఈ మూవీ షాక్ నుండి తేరుకుని మళ్ళీ సినిమాల వైపు యుటర్న్ తీసుకున్న పవన్ క్రిష్ ల మూవీకి మళ్ళీ ‘అజ్ఞాతవాసి’ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి.   


తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ క్రిష్ ల మూవీ ప్రాజెక్ట్ కు హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. వాస్తవానికి ఈ సినిమా విషయంలో ముందుగా ప్రగ్యా జైశ్వాల్ పేరు తెరపైకి వచ్చింది. క్రిష్ ప్రగ్యా క్లోజ్ కాబట్టి ఆమెనే రిపీట్ చేస్తాడని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఒక  బాలీవుడ్ హీరోయిన్ వాణీకపూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది.  


అయితే ఈ ఇద్దరి హీరోయిన్స్ విషయంలో పవన్ పెద్దగా ఆసక్తి కనపరచక పోవడంతో ప్రస్తుతం కీర్తి సురేష్ చుట్టూ పుకార్లు తిరుగుతున్నాయి. ఈ మూవీని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తీస్తున్న పరిస్థితులలో ఈ మూవీ ప్రాజెక్ట్ కు క్రేజ్ ను పెంచడానికి క్రిష్ ఇప్పుడు వ్యూహాత్మకంగా కీర్తి సురేశ్ ను రంగంలోకి దిగుతునట్లు తెలుస్తోంది. 


ఇది ఇలా ఉండగా ఈ సినిమాకుసంబంధించి హీరోయిన్ ఎంపిక పూర్తి కాకుండానే సెకెండ్ షెడ్యూల్ లోకి ఎంటరైంది. అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో పవన్ పై ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను క్రిష్ తీస్తున్నాడు. ఎన్టీర్ బయో పిక్ తో తీవ్ర పరాభవానికి లోనైన క్రిష్ చాలా పట్టుదలతో ఈ మూవీని హిట్ చేయాలి అని చేస్తున్న ప్రయత్నాలకు కీర్తి సురేశ్ సహాయ సహకారాలు ఎంతవరకు లభిస్తాయో చూడాలి. అయితే పవన్ మూడ్స్ ను తట్టుకుని కీర్తి సురేశ్ ఎంతవరకు నిలబడుతుంది అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..

 

మరింత సమాచారం తెలుసుకోండి: