శంకర్ ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఒకరు.  అయన సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.  జెంటిల్ మెన్ సినిమా నుంచి తన సినిమాల్లో ఓ వైవిద్యం ఉండేలా చూసుకుంటారు.  అందుకే అంతలా సక్సెస్ అయ్యారు.  శంకర్ అంటే భారీ చిత్రాల దర్శకుడు.  శంకర్ అంటే గ్రాఫిక్ చిత్రాల దర్శకుడు... శంకర్ అంటే అద్భుతాలు చేయగలిగిన దర్శకుడు.  


ఇలా ఎన్నో పేర్లు ఆయనకు ఉన్నాయి.  అయితే, ఐ సినిమా నుంచి శంకర్ ఫేమ్ తగ్గుతూ వస్తోంది.  ఐ, రోబో 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొంత అపజయాన్ని మూటగట్టుకున్నాయి.  ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో భారతీయుడు 2 సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ భారీ క్రేన్ పైనుంచి కింద పడిపోయింది.  ఈ క్రేన్ కిందపడి ముగ్గురు టెక్నిషియన్లు మరణించారు.  


అయితే, ఆ తరువాత శంకర్ గురించి తెలియలేదు.  శంకర్ కు ఏమైందో తెలియలేదు.  శంకర్ నుంచిగాని, అటు యూనిట్ గురించిగాని ఎలాంటి రెస్పాన్స్ రాకపోయే సరికి శంకర్ కు ఏదో అయ్యిందని అనుకున్నారు.  శంకర్ కు గాయాలయ్యాయని, శంకర్ చనిపోయారని కొందరు ట్వీట్ చేయడం మొదలుపెట్టారు.  అయితే, రీసెంట్ గా శంకర్ నుంచి రిప్లై వచ్చింది.  తనకు ఏమి కాలేదని దాని సారాంశం.  


శంకర్ కు ఏమి కాలేదు.  ఉపిరి పీల్చుకున్నారు.  కానీ, ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు.  ఈ సంఘటన జరిగిన వెంటనే కమల్ హాసన్ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.  కానీ, శంకర్ నుంచి గాని, అటు లైకా ప్రొడక్షన్ నుంచి గాని ఎలాంటి సహాయం అందలేదు.. కనీసం స్పందించలేదు.  అయితే, శంకర్ ఆ ఘటన గురించి కొన్ని విషయాలు చెప్పారు.  తనతో కలిసి పనిచేసిన వ్యక్తులు సడెన్ గా చనిపోయారు అని తెలిసి షాక్ అయ్యినట్టు చెప్పారు.  రోజు నిద్రలేని  రాత్రిళ్లు గడిపానని, వాళ్ళ ఆత్మలు శాంతించాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో మెసేజ్ షేర్ చేశారు.  ఈ మెసేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది.  

">

మరింత సమాచారం తెలుసుకోండి: