స్టార్ హీరో ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ తో డార్లింగ్ బీటౌన్ లో లాంచ్ కాబోతున్నాడట. నార్త్ స్టార్స్ హ్యాండ్ ఇవ్వడంతో టీటౌన్ డైరెక్టర్ ప్రభాస్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. 

 

బాహుబలి బాక్సాఫీస్ సెన్సేషన్ తర్వాత తర్వాత ప్రభాస్ క్రేజ్ బాలీవుడ్ కు కూడా పాకింది. సాహో చిత్రం కూడా నార్త్ బాక్సాఫీస్ వద్ద సత్తాచాటింది. దీంతో తర్వాత ప్రభాస్ బాలీవుడ్ లో మూవీ చేస్తాడని అంతా ఊహించారు. కానీ అంచనాలకు భిన్నంగా డార్లింగ్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్, ఓ తెలుగు డైరెక్టర్ తో బాలీవుడ్ మూవీ చేయబోతున్నట్టు వినిపిస్తోంది. 

 

అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో దర్శకుడు సందీప్ వంగా బాలీవుడ్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా తర్వాత రణ్ బీర్ కపూర్, రణ్ వీర్ సింగ్ లాంటి స్టార్స్ తో సినిమా చేస్తాడని వినిపించింది. అయితే ఇప్పుడు ఆ స్టార్స్ హ్యాండ్ ఇవ్వడంతో ప్రభాస్ తో బాలీవుడ్ లో సినిమా చేయాలని ఈ తెలుగు దర్శకుడు ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. 

 

దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో టీ సిరీస్ హిందీ సినిమాను ప్లాన్ చేశారు. ఆ సినిమాను ప్రభాస్ తో చేస్తే ఇటు తెలుగుతో పాటు హిందీలో కలిసొస్తుందని సందీప్ వంగా ప్లాన్ చేస్తున్నాడట. సమ్మర్ లాస్ట్ లో ఈ కాంబినేషన్ అనౌన్స్ చేస్తారని వినికిడి. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బ్లాక్ బస్టర్ తర్వాత కూడా ఖాళీగా ఉన్న సందీప్ వంగకు ఈ ప్రాజెక్ట్ అయినా ఓకే అవుతుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: