మహేష్ బాబు సరసన, భరత్ అను నేను సినిమాలో నటించిన కియారా అద్వానీని చూసి చాలా మంది ఒక మాట అన్నారు. ఆమె త్వరలోనే టాప్ హీరోయిన్ అవుతుంది అంటూ కామెంట్స్ చేసారు. కాని ఆ తర్వాత ఆమె టాలీవుడ్ లో ఆఫర్లు వద్దని బాలీవుడ్ లో సినిమాల కోసం ప్రయత్నాలు చేసింది. అవి అక్కడ పెద్దగా ఫలించలేదు గాని ఆమెకు పాపులారిటి మాత్రం కాస్త ఎక్కువగానే వచ్చింది అనేది తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెకు మంచి పాపులారిటి వచ్చింది. 

 

ఆ తర్వాత తెలుగులో ప్రయత్నాలు చేసింది అయినా సరే పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంది. తాజాగా విడుదల చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. పెళ్లికి ముందు శృంగారం గురించి కియారా అద్వానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందు శారీరక సంబంధంపై తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆమె స్పష్టం చేసింది. కచ్చితంగా పెళ్ళి చేసుకుంటానని అనుకుంటేనే అటువంటి బంధం కొనసాగిస్తాను అని ఆమె స్పష్టంగా చెప్పింది.

 

తాను ఇప్పటి వరకు ఎవరితో ప్రేమలో పడలేదని తెలిపి౦ది. ఒకవేళ తను ఎవరితో ప్రేమలో ఉన్నా సరే  మీడియాకు ధైర్యంగా తెలుపుతానని ఈ సందర్భంగా చెప్పింది ఆమె. ఎవరైనా పెళ్ళి చేసుకుంటాను అని డిసైడ్ అయిన తర్వాత మాత్రమే రిలేషన్‌షిప్ మొదలు పెట్టాలని ఆమె స్పష్టంగా చెప్పింది. నమ్మకం ఉన్నప్పుడు శారీరకంగా దగ్గరైనా ఎలాంటి తప్పు లేదనేది తన అభిప్రాయమని అని చెప్పుకొచ్చి౦ది. ఈమె మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి రీమేక్ సినిమా కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్ సరసన నటించి ఆకట్టుకుంది కైరా. అయినా సరే ఆ తర్వాత ఆమెకు కొంత కాలం పాటు అవకాశాలు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: